Anantapur: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని దేవస్థానానికి వెళ్తున్నానంటూ ఇద్దరు కూతుర్లు అనసూయ (11), చంద్రమ్మ (9)లను వెంట తీసుకెళ్లిన తండ్రి కొల్లాప్ప, కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర లోలెవల్ (ఎల్ఎల్సి) కాలువలో వారిని తోసివేసాడు. దానితో కూతుర్లు తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య శిల్పమ్మ భర్త కొల్లాప్పను నిలదీయగా.. గ్రామస్తుల సమక్షంలో అతడు తన కూతుర్లను తుంగభద్ర కాలువలో తోసివేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.…