Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం శుభపరిణామమని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడంతో రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఆనందకరమైన సందర్భమని ఆయన అన్నారు. ఇకపై అమరావతి రాజధానిగా అజేయమని స్పష్టం చేశారు.. ఈ బిల్లుకు మద్దతు పలికిన అన్ని రాజకీయ పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇకపై అపోహలను విడిచిపెట్టి…