ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి ఏఐఎక్స్ కనెక్ట్ కింద నమోదైన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పేరుతో నడవనున్నాయి. విలీనం అనంతరం కార్యకలాపాలను పరిశీలిస్తామని డీజీసీఏ తెలిపింది.