Odisha Student: తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించింది. తీవ్రమైన కాలిన గాయాలతో జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్ నుంచి సుదీర్ఘ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య…
AIIMS: భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు కీలక ఆపరేషన్ నిర్వహించి 9 ఏళ్ల బాలుడి ప్రాణాలను కాపాడారు. ఉపిరితిత్తుల్లో ‘‘కుట్టు సూది’’ని తొలగించి అతడిని కాపాడినట్లు శుక్రవారం ఎయిమ్స్ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆస్పత్రిలోని పీడియాట్రిక్ విభాగం ఎలాంటి ఓపెన్ సర్జరీ చేయకుండా బ్రొంకోస్కోపిక్ ద్వారా కుట్టు సూదిని తొలగించినట్లు, ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు.