నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బ్లాక్ బస్టర్ మూవీస్ ‘సింహా, లెజెండ్’ తర్వాత ముచ్చటగా మూడోసారి బాలకృష్ణను ‘అఖండ’ తో డైరెక్టర్ చేస్తున్నారు బోయపాటి శ్రీను. ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రాజీపడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా సంగీత సంబరాలు శనివారం సాయంత్రం మొదలయ్యాయి. ‘అఖండ’ చిత్రంలోని ‘అడిగా… అడిగా… పంచప్రాణాలు నీ రాణిగా’ అనే మెలోడీ సాంగ్ లిరికల్…