తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. విభేదాలు పక్కనబెట్టి.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర్రెడ్డిలపై…
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన మన ఊరు-మన పోరు సభ ముగిసింది. 35 వేల మెజారిటీతో సురేందర్ ని గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించే సమయం కూడా లేదు. ఒక్క ఎమ్మెల్యే డబ్బులు పెట్టుకుంటే వందలాది కరడుగట్టిన సైనికులను తయారు చేస్తాం.టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి ఎకరాలకు నీరు, ఉచిత విద్యుత్ ఇచ్చామని…