Home
Acb
Acb News
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి వారికి నో ఎంట్రీ..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించినట్టు వెల్లడించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ.. ఈ మేరకు మెమో జారీ చేశారు… కాగా, అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్స్… -
స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం.. వాటిపైనే సీఐడీ ఫోకస్
ఏపీలో సంచలనం కలిగిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాు.ఈ స్కాంలో సీఐడీ విచారణ లోతుగా కొనసాగిస్తోంది. రూ.242 కోట్ల అక్రమాలపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు అనేక అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇందు కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ముంబైలలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ, పూణేలోని షెల్ కంపెనీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. డిజైన్ టెక్ కి తాము ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వలేదని పూణే సంస్థలు స్పష్టం చేశాయని… -
ఇంజనీర్ అవినీతి భాగోతం… పైప్లైన్ తెరిస్తే నోట్ల కట్టలు బయటపడ్డాయి…
బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని హ్యాపీగా ఉండాల్సిన ఉద్యోగులు అవినీతి బాట పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి చివరకు కటకటాల పాలవుతున్నారు. కర్ణాటకలోని కలుబుర్గి జిల్లాకు చెందిన పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఇంజనీర్ శాంతగౌడ బిరదర్ అవినీతి భాగోతం సోషల్ మీడియాకి ఎక్కింది. సంపాదించిన అవినీతి సొమ్ముతో అన్ని హంగులతో ఇంటిని నిర్మించుకున్నాడు. Read: ఇయర్ ఎండ్ మానియా: భారీగా పెరిగిన విమానం- హోటల్ రూమ్స్ ధరలు… ఈజీ మనీకి అలవాటుపడిన ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ… -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఏఇ
లంచానికి అలవాటు పడ్డ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో రైతు వద్ద 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు విద్యుత్ శాఖ ఏఏఇ రాజ్ కుమార్. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన రైతు షౌకత్ అలీ తన పొలానికి మంజూరైన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఏఇని కోరాడు. అయితే, అలా చేయడానికి లంచం డిమాండ్ చేశాడు విద్యుత్… -
నెల రోజుల వ్యవధిలోనే ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు..!
వరసగా ఏసీబీ దాడులు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా విమర్శలు. వీటికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ఏకంగా సబ్ రిజిస్ట్రార్లకే కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిఘా పెట్టారని ప్రచారం జరుగుతోంది. అందుకే నీడ కనిపించినా ఉలిక్కి పడుతున్నారట అధికారులు, సిబ్బంది. నెల రోజుల వ్యవధిలోనే ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు..! మామూళ్లు ఇస్తే కానీ.. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పనులు జరగవనే… -
భూకొలతల శాఖ ఏడీ ఇళ్లలో ఏసీబీ దాడులు…
సంగారెడ్డి భూకొలతల శాఖ ఏడీ మధుసూదన్రావు ఇళ్లలో ఏసీబీ దాడులు చేసింది. సోదాల్లో కోటి మూడు లక్షల నగదు, 3కేజీల బంగారం,కోటి విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక భూమిని సర్వే చేసి నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసారు మధుసూధన్. ఏడీ మధుసూదన్రావుతో పాటు మరో జూనియర్ ను 20 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఉప్పల్ లో ఉన్న మధుసూధన్ ఇంటి పై దాడులు నిర్వహించిన ఏసీబీ… మేడ్చల్ మల్కాజ్… -
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్
ఓ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన జోగులంబ గద్వాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని కెటిదొడ్డి మండలం ఇర్లబండ గ్రామ శివారులో గద్వాల పట్టణానికి చెందిన వెలుగు రమణకు 7 ఎకరాల పొలం ఉంది. జీవన ఉపాధి నిమిత్తం అమనగల్ ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే తన భూమి కజ్జాకు గురవుతుందంటూ వెంటనే సర్వే చేయాలని పలుసార్లు జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఆపై కెటిదొడ్డి మండలానికి చెందిన సర్వేయర్ తిక్కన్నను ఆశ్రయించాడు.… -
సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ కేసు.. స్పీడ్ పెంచిన ఏసీబీ
సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ కావడం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది.. అయతే, గతంలో వెలుగు చూసిన సీఎంఆర్ఎఫ్ కుంభకోణం విచారణలో స్పీడ్ పెంచింది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. సీఎంఆర్ఎఫ్ విభాగంలో కొంత మందిని గతంలోనే విచారించిన ఏసీబీ అధికారులు.. గతంలో జరిపిన విచారణకు హాజరు కాని మరొ కొందరు సిబ్బందని ఇప్పుడు ప్రశ్నిస్తోంది.. గతంలో విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి విచారణకు పిలిచింది ఏసీబీ.. మరోవైపు.. ఈ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ.. ఇప్పటికే నలుగురిని అరెస్ట్… -
ఏసీబీ వలలో కాటారం తహశీల్దార్ సునీత
మరో అవినీతి తహసీల్దార్ ఏసీబీ వేసిన వలకి చిక్కింది. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడింది. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ అనే వ్యక్తి గ్రామ శివారులోని సర్వే నెంబరు 3లో తన భూమికి పట్టా పాస్ బుక్కులు ఇచ్చేందుకు తహసీల్దార్ రూ. 3 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను… -
మంత్రి పేర్ని నాని నియోజకవర్గంలో ఏసీబీ తనిఖీలు !
మంత్రిగారి ఇలాకాలో తనిఖీలు లేదా దాడులు చేయాలంటే అధికారులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఆ అమాత్యుడి నియోజకవర్గంలో ఏకంగా ACB ఎంట్రీ ఇచ్చింది. ప్రతి రికార్డును నిశితంగా పరిశీలించడంతో ఒక్కటే గగ్గోలు.. ఉద్యోగవర్గాల్లో కలకలం. కానీ.. ACB దాడుల వెనక అసలు సంగతి వేరే ఉందట. అదే అక్కడ హాట్ టాపిక్! బందర్ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలపై చర్చ! ఇటీవల కృష్ణా జిల్లా బందరు మున్సిపాల్టీలో పెద్దఎత్తున ఏసీబీ సోదాలు జరిగాయి. మున్సిపల్ రికార్డులను తనిఖీలు…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!