Andhra Pradesh: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయం ముందు రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను గురువారం నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, విజయవాడ…
(ఆగస్టు 31న ఆరుద్ర జయంతి)తెలుగు సాహితీవనంలోనూ, తెలుగు సినిమారంగంలోనూ ఆరుద్ర ముద్ర చెరిగిపోనిది. చిత్రసీమలో ఆరుద్ర పాటలు, మాటలు జనాన్ని ఎంతగానో మురిపించాయి. ఇక సాహితీరంగంలో ఆరుద్ర పరిశోధనలు ఎన్నెన్నో తెలియని అంశాలను వెలుగులోకి తెచ్చాయి. అందుకే తెలుగువారికి సదాస్మరణీయులు ఆరుద్ర. తెలుగు సాహితీవనంలో నవకవనాలు విరబూస్తున్న రోజుల్లో శ్రీశ్రీ ఈ యుగం నాది అన్నారు. ఆయన స్థాయిలోనే ఆరుద్ర సైతం తన బాణీ పలికించారు. ఆ నాటి కవితాప్రియులను శ్రీశ్రీ తరువాత అంతగా ఆకట్టుకున్నది ఆరుద్ర…