ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కు తీసుకువచ్చిన తర్వాత గురువారం పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రాణాను 18 రోజుల NIA కస్టడీకి అప్పగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వూర్ రాణాను NIA కస్టడీలోకి తీసుకుంది. ఈ కస్టడీలో భాగంగా 26/11 ఉగ్రవాద దాడి వెనుక ఉన్న మొత్తం కుట్రను వెలికితీసేందుకు అతన్ని వివరంగా ప్రశ్నించనున్నారు. అమెరికా నుంచి భారత్ కు తరలించిన…
TAHAWWUR RANA: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు, ఉగ్రవాది తహవూర్ హుస్సేన్ రాణానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసింది. భారత అధికారులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి రొమేనియా మీదుగా ఛార్టెడ్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీకి తీసుకువచ్చిన వెంటనే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ సంవత్సరాల కృషి మూలంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అమెరికా భారత్కి అప్పగించింది.