NTV Telugu Site icon

Virat Kohli: లతాజీని కలవకపోవడం బాధగా ఉంది: కోహ్లీ ఇంటర్వ్యూ వైరల్

Koh

Koh

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇంటర్వ్యూను కోహ్లీ ట్విట్టర్‌లో షేర్ చేయగా అందులోని ఇంట్రస్టింగ్ విషయాలు వైరల్‌గా మారాయి. ఇందులో అవతలి వ్యక్తి అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు కోహ్లీ అంతకంటే ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలోనే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ను కలవలేకపోయానన్న బాధ తనకు ఉన్నట్లు కోహ్లీ చెప్పాడు.”చరిత్రలో నిలిచిపోయిన ఏ మహిళతో మీరు డిన్నర్‌కు వెళ్లాలని అనుకుంటారు” అన్న ప్రశ్నపై విరాట్ స్పందిస్తూ.. “లతాజీ కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఆమెతో కలిసి మాట్లాడి, ఆమె జీవితం గురించి, ఆమె ప్రయాణం గురించి మరింత తెలుసుకునే అవకాశం వచ్చి ఉంటే బాగుండేది” అని చెప్పుకొచ్చాడు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీని కూడా విరాట్ గుర్తు చేసుకున్నాడు. “ఒకవేళ ఓ దీవిలో మీరు మీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరితో కలిసి ఓ దీవిలో చిక్కుకుపోవాలని అనుకుంటారు” అని ప్రశ్నించగా.. మహ్మద్ అలీ అని విరాట్ సమాధానమిచ్చాడు. ఈ అమెరికన్ బాక్సర్‌కు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ హెవీ వెయిట్ బాక్సర్‌గా పేరుంది. తనకు అత్యంత సంతోషకరమైన ప్లేస్ తన ఇల్లే అని కూడా ఈ సందర్భంగా విరాట్ చెప్పాడు. తన జీవితంలో ప్రయత్నించిన అత్యంత విచిత్రమైన డైట్ ఏది అని అడిగితే.. తనకు 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ తిన్నదంతా అదే అని, తాను ప్రపంచంలోని జంక్ ఫుడ్ మొత్తం తినేవాడినని కోహ్లీ చెప్పాడు. ప్లాంకింగ్‌లో తన రికార్డు టైమ్ మూడున్నర నిమిషాలని కూడా కోహ్లీ తెలిపాడు. కోహ్లీ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో తన ప్లాంకింగ్ టైమ్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూలో ఇది తొలి పార్ట్ మాత్రమే. రెండో ఎపిసోడ్ కూడా రానుందని వీడియో చివర్లో వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కాబోయే నాలుగు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే అతడు టీమిండియాతో చేరనున్నాడు.

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు