Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
- మరో అరుదైన ఘనతకు చేరువలో వైభవ్
- ఈ నెలాఖరులో ఐర్లాండ్తో టీ20 సిరీస్
- క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Set to Break Sachin Tendulkar’s Record: ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టులోకి వచ్చేందుకు సిద్దమయ్యాడు. బీసీసీఐ సెలెక్టర్లు బుడ్డోడిని త్వరలోనే టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే భారత పురుషుల జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 15 సంవత్సరాలు 70 రోజులు మాత్రమే. ఈ నెలాఖరులో ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరిగే ఈ సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేస్తే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడి రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. సచిన్ 1989లో పాకిస్థాన్పై 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేసేందుకు బుడ్డోడికి ఇంకా ఏడాది సమయం ఉంది.
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. అతడి స్ట్రైక్రేట్ 237.30గా ఉండటం విశేషం. ఈ ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ వ్యక్తిగత సీజన్లలో ఒకటిగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అతడు జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంకలో జరగనున్న ఇండియా-ఏ త్రైపాక్షిక సిరీస్కు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీలో శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్లు కూడా పాల్గొంటాయి. వైభవ్ డెబ్యూపై బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?