Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
- మరో అరుదైన ఘనతకు చేరువలో వైభవ్
- ఈ నెలాఖరులో ఐర్లాండ్తో టీ20 సిరీస్
- క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Set to Break Sachin Tendulkar’s Record: ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టులోకి వచ్చేందుకు సిద్దమయ్యాడు. బీసీసీఐ సెలెక్టర్లు బుడ్డోడిని త్వరలోనే టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే భారత పురుషుల జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 15 సంవత్సరాలు 70 రోజులు మాత్రమే. ఈ నెలాఖరులో ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరిగే ఈ సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేస్తే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడి రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. సచిన్ 1989లో పాకిస్థాన్పై 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేసేందుకు బుడ్డోడికి ఇంకా ఏడాది సమయం ఉంది.
Also Read
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. అతడి స్ట్రైక్రేట్ 237.30గా ఉండటం విశేషం. ఈ ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ వ్యక్తిగత సీజన్లలో ఒకటిగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అతడు జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంకలో జరగనున్న ఇండియా-ఏ త్రైపాక్షిక సిరీస్కు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీలో శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్లు కూడా పాల్గొంటాయి. వైభవ్ డెబ్యూపై బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..