పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. అతడి బౌలింగ్ యాక్షన్. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్లో తారిక్ బౌలింగ్ యాక్షన్పై విమర్శలు వచ్చాయి. ఆసీస్ టాప్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లోనూ మరోసారి అతడి బౌలింగ్ యాక్షన్ చర్చకు వచ్చింది. ఈసారి ఏకంగా అభిమానులే అతడిని టార్గెట్ చేశారు. ఇక తారిక్ బౌలింగ్ యాక్షన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి బౌలింగా.. అలా అయితే వీధుల్లో ఆడే చిన్న పిల్లలు కూడా బౌలింగ్ చేయగలరు అని ఉస్మాన్ తారిక్ను వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. తారిక్ బంతి విసిరే ముందు బ్యాట్స్మన్ వైపు చూసి.. ఆ తరువాత చేతితో విడుదల చేస్తున్న విధానం ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. ఇలాంటి బౌలింగ్ యాక్షన్పై సమగ్ర విచారణ జరగాలని ఐసీసీకి సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో నిబంధనలు, ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని వీరూ అభిప్రాయపడ్డారు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, విశ్లేషకులు ఈ అంశంపై మద్దతుగా నిలుస్తూ.. మరింత వేడెక్కిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో మరోసారి బౌలింగ్ యాక్షన్పై వివాదం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ఏ మ్యాచ్లో ఉస్మాన్ తారిక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి.. 27 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడు. తారిక్ త్రో వేస్తున్నాడు అంటూ యూఎస్ఏ ఫాన్స్ మైదానంలో అరుస్తూ, ఇమిటేట్ చేస్తూ గోలగోల చేశారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 190/9 పరుగులు చేయగా.. యూఎస్ఏ 159/8 పరుగులకే పరిమితమైంది. తారిక్ను టీమిండియాపై ఆడించాలన్నదే పాక్ అసలు ప్లాన్.
