బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఆహార ప్రణాళికలో కొత్త నియమాలు పెట్టిందనే వార్తలు నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ వార్తల పై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఏ విధమైన నియమాలు పెట్టలేదని తెలిపారు. ఈ ఏడాది బీసీసీఐ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల యొక్క ఆహార అలవాట్లు నిర్ణయించడంలో క్రికెట్ బోర్డు ఎటువంటి పాత్ర పోషించదు అని పేర్కొన్నారు.
అలాగే రేపటి నుండి న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కు ముందు భారత ఆటగాళ్ల కోసం బోర్డు కొత్త ఆహార ప్రణాళికను సిద్ధం చేసిందని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే ఆటగాళ్లు ఏం తినాలో.. ఏం తినకూడదో ఎందుకునే స్వేచ్ఛ ఆటగాళ్లకు ఎప్పుడు ఉందని… ఇక మీదట కూడా ఉంటుంది అని ధుమల్ తెలిపారు. అయితే రేపు కాన్పూర్ లో భారత్ – కివీస్ ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టుకు అజింక్య రహానే న్యాయకత్వం వహించనున్నాడు.