నాలుగో టెస్టులో పట్టుబిగించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాల్గో టెస్టులో భారత బ్యాట్స్మెన్లు…అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్తోపాటు వన్డౌన్ బ్యాట్స్మెన్ పూజారా…రాణించారు. దీంతో భారత్ 3వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 171 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ జడేజా క్రీజులో ఉన్నారు. మరో 150 పరుగులు చేస్తే…భారత్ విజయం సాధించే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 171 పరుగుల ఆధిక్యం సాధించింది కోహ్లీ సేన. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్…తొలి వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద…కేఎల్ రాహుల్ ఔటయ్యాడు.
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
రాహుల్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన చతేశ్వర్ పూజారా….రోహిత్కు జత కలిశారు. వీరిద్దరు కలిసి…స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మరో వికెట్ పడకుండా…జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్కు 153 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మూడోరోజు భారత్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అద్భుతంగా ఆడుతున్న వీరిని రాబిన్సన్ ఒకే ఓవర్లో పెవిలియన్ పంపి భారత్కు గట్టి షాక్ ఇచ్చాడు. మొయిన్ అలీ వేసిన 63.5 ఓవర్కు రోహిత్ సిక్సర్ బాది టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు.
81వ ఓవర్లో తొలుత పుల్షాట్ ఆడిన రోహిత్..127 పరుగుల వద్ద రాబిన్సన్ బౌలింగ్లో క్రిస్వోక్స్ చేతికి చిక్కాడు. 61 పరుగులు చేసిన పుజారా… అనూహ్య బంతికి మొయిన్ అలీకి దొరికిపోయాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 22 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అనంతరం కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు.
ఈ మ్యాచ్లో విజయావకాశాలు… భారత్కే ఎక్కువగా ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. జట్టులో ప్రపంచస్థాయి బ్యాట్స్మెన్ ఉన్నారని.. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న ఓవల్ మైదానంలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా ఆటగాళ్లంతా మ్యాచ్ గెలవాలనే కసితో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!