Site icon NTV Telugu

Cricket: కామన్వెల్త్ క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ఏపీ అమ్మాయికి అవకాశం

Harman Preet Kaur

Harman Preet Kaur

కామన్వెల్త్ క్రీడల్లో అధికారులు మహిళల క్రికెట్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు మహిళల టీమిండియా జట్టు ఇప్పటికే బర్మింగ్‌హోమ్ చేరుకుంది. తాజాగా ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది ప్లేయర్స్ లిస్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘనకు జట్టులో చోటు దక్కింది.

కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్‌ రాణా.

Read Also: ICC WTC: ఆసీస్‌పై విజయంతో భారత్ స్థానానికి ఎసరు పెట్టిన శ్రీలంక

కామన్వెల్త్ క్రీడల్లో జరిగే క్రికెట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా అధికారులు విభజించారు.గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్ ఉండగా.. గ్రూప్​-బిలో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. కాగా ఈనెల 29న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవల టీ20 ఫార్మాట్‌లో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత అమ్మాయిలు 2-1తో సొంతం చేసుకోవడంతో కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

Exit mobile version