జూన్ 20, గురువారం ఆఫ్ఘనిస్తాన్తో తమ మొదటి సూపర్ 8 మ్యాచ్కు ముందు భారత జట్టు బార్బడోస్ చేరుకుంది. గ్రూప్-స్టేజ్ లో కెనడాతో చివరి మ్యాచ్ రద్దు తర్వాత, భారత జట్టు బార్బడోస్ లోని అద్భుతమైన బీచ్ లలో బీచ్ వాలీబాల్ ఆడుతూ కొంత సమయం గడిపింది. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అప్లోడ్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్ తమను తాము ఆనందిస్తున్నట్లు కనపడుతుంది.
Buchi Babu : ఆ హీరో కాళ్లు మొక్కిన ఉప్పెన డైరెక్టర్.. ఎందుకంటే?
భారత జట్టు గ్రూప్ A నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు సూపర్ 8 దశలకు అర్హత సాధించింది. భారత జట్టు ఐర్లాండ్, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( USA )తో జరిగిన మ్యాచ్ లలో గెలిచింది. కెనడాతో వారి మ్యాచ్ వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల రద్దయింది. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో కరేబియన్ దీవుల్లోని బార్బడోస్ లో భారత్ ఇకపై మ్యాచ్ లు ఆడనుంది. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు బంతితో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలతో టీమిండియాకు వెన్నముక్క ఆటగాడిగా ఉన్నాడు. అక్షర్ పటేల్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ బాగా రాణించగా., అర్ష్దీప్ సింగ్ బంతితో తన ఆశించదగిన ప్రదర్శన ఇవ్వగలిగాడు. కాకపోతే టీమిండియా బ్యాటింగ్ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తుంది. అయితే న్యూయార్క్ లోని పిచ్ కారణంగా చాలా వరకు ఇది జరిగి ఉండవచ్చు.
Manipur Violence: మణిపూర్లో జరిగిన హింసపై అమిత్ షా సమీక్ష..
జూన్ 20న బార్బడోస్ లో ఆఫ్ఘనిస్థాన్తో భారత్ తమ సూపర్ 8 మ్యాచ్ ను ప్రారంభించనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్తో తలపడేందుకు ఆంటిగ్వాకు వెళతారు. రెండు రోజుల తర్వాత జూన్ 24న సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో సూపర్ 8 దశను ముగిస్తారు. టీమిండియా అన్ని మ్యాచ్లు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.
20 జూన్: ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్ .
22 జూన్: ఇండియా vs బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, ఆంటిగ్వా .
24 జూన్: ఇండియా vs ఆస్ట్రేలియా, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా.