Site icon NTV Telugu

IND Vs ZIM: టీమిండియాలో మరో మార్పు.. గాయంతో ఆల్‌రౌండర్ దూరం

Washington Sundar

Washington Sundar

IND Vs ZIM: ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలియజేసింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా వాషింగ్టన్ సుందర్‌ భుజానికి గాయమైంది. ఆగస్టు 10న ఓల్డ్‌ ట్రాఫోర్డులో లాంక్‌షైర్‌కు ఆడుతూ ఓ మ్యాచ్‌లో డైవ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు జింబాబ్వే టూర్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం సుందర్ రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లనున్నాడు. అతడి గాయంపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు.

Read Also: Supreme Court: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య సస్పెన్షన్‌పై విచారణకు సుప్రీం అంగీకారం

‘ఇటీవల వాషింగ్టన్ సుందర్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. కానీ అతనిలో చాలా నైపుణ్యం ఉంది. దురదృష్టం కొద్దీ సిరీస్‌లు మిస్ అవుతున్నాడు. ఈ విషయంలో కొద్దిగా అదృష్టం కూడా కావాలి. మరో వారంలో భారత్‌కు ఆడుతున్నాడని అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఈ గాయమైంది’ అంటూ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. కాగా గత ఏడాది జులైలో ఇంగ్లండ్ పర్యటనలో ఓ ప్రాక్టీస్ గేమ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో చేతి వేలి గాయానికి గురైన సుందర్.. వరుసగా గాయపడుతునే ఉన్నాడు. డొమెస్టిక్ సీజన్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. తర్వాత కరోనా బారినపడి కోలుకున్నాడు. ఆ తర్వాత కాలిపిక్క కండరాల గాయంతో వెస్టిండీస్, శ్రీలంకతో సిరీస్‌లకు అందుబాటులో లేడు. అటు ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడలేదు. రిహాబిలిటేషన్ తర్వాత బీసీసీఐ పర్మిషన్‌తో కౌంటీల్లో ఆడాడు. చివరకు జట్టులోకి వచ్చే సమయంలో మరోసారి భుజం గాయంతో దూరమయ్యాడు.

Exit mobile version