ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సయమంలో మరో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెలువడింది. జులై 5 న లంకకు బయలుదేరనున్న భారత్ బి జట్టు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20 ల్లో పోటీ పడనున్నాయి. ఇందులో జులై 13న మొదటి వన్డే మ్యాచ్ అలాగే వరుసగా 16,18 న రెండు, మూడు వన్డేలు జరగనుండగా జూలై 21,23,25వ తేదీల్లో టీ20లు మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రధాన జట్టులో చోటు దక్కని ఆటగాళ్లతో కూడిన జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ టూర్పై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇవ్వగా ఈ జట్టుకి దివాల్ రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.