RR Captain 2026: యశస్వి జైస్వాల్ కాదు.. రాయల్స్ కెప్టెన్ రేసులో ఆ ఇద్దరే!
- ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 వేలం
- ప్రశ్నార్థకంగానే ఆర్ఆర్ కెప్టెన్సీ
- రాయల్స్ కెప్టెన్ రేసులో ఆ ఇద్దరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కు సంబంధించిన వేలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. వేలంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆచితూచి వ్యహరించింది. వేలంకు ముందే చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్ సంజు శాంసన్ను ట్రేడ్ చేసింది. మినీ వేలం తర్వాత జడేజా, సామ్ కరణ్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లతో బలమైన జట్టును ఏర్పాటు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
జియోస్టార్తో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ… ‘రాజస్థాన్ రాయల్స్లో 10 మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆర్ఆర్కు చాలా బౌలింగ్ ఎంపికలు ఉన్నాయి. జైపూర్ స్టేడియంలో బౌలర్లు సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేస్తే.. జట్టు విజయాలు అందుకుంటుంది. బిష్ణోయ్, జడేజా వంటి టాప్ స్పిన్నర్లు. షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెర్రీరా, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్లతో బ్యాటింగ్ బాగుంది. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. అయితే నాకు ఒకే ఒక ప్రశ్న ఉంది, అది కెప్టెన్సీ. కెప్టెన్సీని రియాన్ పరాగ్ లేదా రవీంద్ర జడేజాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు’ అని అన్నాడు.
Also Read
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- 2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే కూడా ఆర్ఆర్ జట్టు సమతుల్యతను ప్రశంసించాడు. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్స్ సహా ఆల్రౌండర్లు కీలకమని పేర్కొన్నాడు. జోఫ్రా ఆర్చర్ వంటి కీలక ఫాస్ట్ బౌలర్ల ఫిట్నెస్ గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ జట్టును పరిశీలిస్తే.. కెప్టెన్సీ అత్యంత ముఖ్యమైన విషయం. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్స్, ఆల్రౌండర్లతో జట్టు బలంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభంలో ఆర్చర్ వంటి కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ కూడా చాలా కీలకం. చివరగా కెప్టెన్ ఎవరో జట్టు యాజమాన్యం నిర్ణయించి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది’ అని కుంబ్లే అన్నారు.
తాజావార్తలు
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!