INDvsNZ ODI: రోహిత్, గిల్ సెంచరీల మోత..న్యూజిలాండ్ టార్గెట్ 386
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (101), శుభ్మన్ గిల్ (112) సెంచరీల మోత మోగించారు. ప్రత్యర్థి బౌలర్ల పనిపడుతూ పరుగుల వరద పారించారు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రోహిత్సేన నిర్ణీత 50 ఓవర్లలో 385/9 భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ను రోహిత్ మొదట నెమ్మదిగా మొదలుపెట్టగా.. గిల్ మాత్రం తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫెర్గుసన్ వేసిన రెండో ఓవర్లో ఫోర్తో బౌండరీల ఖాతా తెరిచిన గిల్.. అదే జోరు కొనసాగించాడు. ఇక ఫెర్గుసన్ వేసిన 8వ ఓవర్లో అయితే ఏకంగా నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్తో 22 రన్స్ పిండుకున్నాడు. 10వ ఓవర్లో రెండు సిక్సర్లతో రోహిత్ కూడా టచ్లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 33 బంతుల్లో గిల్ అర్ధశతకం చేయగా.. రోహిత్ 41 బాల్స్లో 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అనంతరం మరింత జోరు పెంచిన వీరిద్దరూ తమదైన శైలి బ్యాటింగ్తో రెచ్చిపోయారు. ఆసాంతం క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్లో రోహిత్కు ఇది 30వ వన్డే సెంచరీ. అనంతరం యంగ్ ఓపెనర్ గిల్ కూడా తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 72 బాల్స్లో శతకం బాదాడు. కాసేపటికే వీరిద్దరూ ఔటయ్యారు. దీంతో మొదటి వికెట్కు 212 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
మిడిల్ ఢమాల్
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
రోహిత్, గిల్ అందించిన అద్భుత శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోని మిడిలార్డర్ బ్యాటర్లు వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ నిరాశపర్చిన విరాట్ కోహ్లీ (36) ఈ మ్యాచ్లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక మిడిల్లో వచ్చిన ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ (14), సుందర్ (9) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 313 రన్స్కు టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమ్ స్కోర్ 400 ఈజీగా దాటుతుందనుకున్న ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. చివర్లో హార్దిక్ (54) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత జట్టు 385/9 స్కోర్ చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో డఫ్పీ, శాంట్నర్ చెరో మూడు వికెట్లతో రాణించగా బ్రేస్వెల్ ఒక వికెట్ తీశాడు.
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!