INDvsNZ ODI: రోహిత్, గిల్ సెంచరీల మోత..న్యూజిలాండ్ టార్గెట్ 386
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (101), శుభ్మన్ గిల్ (112) సెంచరీల మోత మోగించారు. ప్రత్యర్థి బౌలర్ల పనిపడుతూ పరుగుల వరద పారించారు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రోహిత్సేన నిర్ణీత 50 ఓవర్లలో 385/9 భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ను రోహిత్ మొదట నెమ్మదిగా మొదలుపెట్టగా.. గిల్ మాత్రం తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫెర్గుసన్ వేసిన రెండో ఓవర్లో ఫోర్తో బౌండరీల ఖాతా తెరిచిన గిల్.. అదే జోరు కొనసాగించాడు. ఇక ఫెర్గుసన్ వేసిన 8వ ఓవర్లో అయితే ఏకంగా నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్తో 22 రన్స్ పిండుకున్నాడు. 10వ ఓవర్లో రెండు సిక్సర్లతో రోహిత్ కూడా టచ్లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 33 బంతుల్లో గిల్ అర్ధశతకం చేయగా.. రోహిత్ 41 బాల్స్లో 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అనంతరం మరింత జోరు పెంచిన వీరిద్దరూ తమదైన శైలి బ్యాటింగ్తో రెచ్చిపోయారు. ఆసాంతం క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్లో రోహిత్కు ఇది 30వ వన్డే సెంచరీ. అనంతరం యంగ్ ఓపెనర్ గిల్ కూడా తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 72 బాల్స్లో శతకం బాదాడు. కాసేపటికే వీరిద్దరూ ఔటయ్యారు. దీంతో మొదటి వికెట్కు 212 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
మిడిల్ ఢమాల్
Also Read
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
రోహిత్, గిల్ అందించిన అద్భుత శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోని మిడిలార్డర్ బ్యాటర్లు వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ నిరాశపర్చిన విరాట్ కోహ్లీ (36) ఈ మ్యాచ్లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక మిడిల్లో వచ్చిన ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ (14), సుందర్ (9) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 313 రన్స్కు టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమ్ స్కోర్ 400 ఈజీగా దాటుతుందనుకున్న ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. చివర్లో హార్దిక్ (54) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత జట్టు 385/9 స్కోర్ చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో డఫ్పీ, శాంట్నర్ చెరో మూడు వికెట్లతో రాణించగా బ్రేస్వెల్ ఒక వికెట్ తీశాడు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!