భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్లోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన చివరి శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో పోరాడుతున్న ఖచంద్ర ఆరోగ్యం ఇటీవల తీవ్రంగా క్షీణించింది. ఇటీవలి రోజుల్లో పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి.. చికిత్స అందించారు. క్యాన్సర్ నాలుగో స్టేజ్లో ఉండడంతో ఆయన శారీరం సహకరించక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Rinku Singh Father Dead: రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం!
- రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం
- రింకూ తండ్రి ఖచంద్ర కన్నుమూత
- కాలేయ క్యాన్సర్తో పోరాడిన ఖచంద్ర

Rinku Singh Father Death