ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరిగింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్ తలపడిందిం. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్కు దిగారు. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ 96 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మ్యాక్స్వెల్ 23, షాబాజ్ అహ్మద్ 26 పరుగులు చేశారు. చివర్లో కార్తిక్ 8 బంతుల్లో 13 నాటౌట్గా మిగిలాడు. కాగా నాలుగు పరుగుల తేడాతో డుప్లెసిస్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. లక్నో బౌలర్లలో దుశ్మంత చమీర, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 11 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా 32, దీపక్ హుడా 9 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 30 పరుగులు చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షల్ పటేల్ బౌలింగ్లో కీపర్ కార్తిక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ పాండ్యా 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 30, స్టోయినిస్ 24 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ 4, హర్షల్ పటేల్ 2, సిరాజ్, మ్యాక్స్వెల్ చెరొక ఒక వికెట్ తీశారు.
