ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. మరోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని పీవీ సింధు చేజార్చుకుంది. శనివారం జరిగిన సెమీస్లో థాయ్లాండ్కు చెందిన సుపానిడా కటేథాంగ్ చేతిలో సింధు ఓటమిపాలైంది. 14-21, 21-13, 10-21 స్కోరు తేడాతో మ్యాచ్ కోల్పోయింది. దీంతో ఇండియా ఓపెన్ టోర్నీ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది.
Read Also: బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్బై..!!
కాగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సహచర షట్లర్ అస్మిత చాలిహపై 21-7, 21-18 తేడాతో పీవీ సింధు సునాయస విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ప్రపంచ 7వ ర్యాంకర్ పీవీ సింధు తన ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించి సెమీఫైనల్ చేరింది. కానీ సెమీఫైనల్లో ఓడిపోయి మరోసారి భారత అభిమానులను సింధు నిరాశపరిచింది.
