Women’s IPL: ఫ్రాంచైజీ రేసులో 30 కంపెనీలు..బీసీసీఐకి కాసుల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s IPL: మహిళా క్రికెటర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విమెన్స్ ఐపీఎల్కు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు బీసీసీఐ టెండర్లు ఆహ్వానించగా మొత్తం 30 సంస్థలు టెండర్ దరఖాస్తులు కొనుగోలు చేశాయి. మహిళల ఐపీఎల్ మొదటి సీజన్లో ఐదు జట్లు పోటీ పడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెన్స్ ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసిన 10 కంపెనీలతో పాటు ఇంగ్లీష్ ఫుట్బాల్ లీగ్కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్, భారత స్నాక్ బ్రాండ్ హల్దీరామ్స్ కూడా పోటీలో ఉండటం గమనార్హం. ఫ్రాంచైజీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు నేటితో (జనవరి 21) ముగియనుండగా.. హల్దీరామ్స్ ఇటీవలే టెండర్ దాఖలు చేసింది. మహిళ ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం పది భారత నగరాలు, వేదికలతో బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. సంస్థలు సింగిల్గా.. ఒకటి కంటే ఎక్కువ నగరాలకు బిడ్ దాఖలు చేసేలా నిబంధనలు విధించింది. ఇందుకోసం ఎలాంటి ప్రాథమిక ధరను నిర్ణయించలేదు. ఈ బిడ్లు పదేళ్ల కాలానికి అమల్లో ఉంటాయని పేర్కొంది.
పోటీలో ఎవరున్నారంటే..
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
పురుషుల ఐపీఎల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పది ఫ్రాంచైజీలు మహిళల లీగ్కు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేశాయి. అదానీ (గల్ఫ్ జెయింట్స్), కాప్రి గ్లోబల్ (షార్జా వారియర్స్) కూడా టెండర్ వేయనున్నాయి. సిమెంట్ కంపెనీలు చెట్టినాడ్ సిమెంట్, జేకే సిమెంట్లూ ఫ్రాంచైజీ కొనుగోలు పట్ల ఆసక్తితో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు స్పోర్ట్స్ లీగ్ల్లో ఆసక్తి కనబర్చని శ్రీరామ్ గ్రూప్, నీలగిరి గ్రూప్, ఏడబ్ల్యూ కట్కూరి గ్రూప్ కూడా రేసులో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సంయుక్త యజమానులైన తెలుగు సంస్థ జీఎంఆర్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ వేర్వేరుగా టెండర్ డాక్యుమెంట్లు తీసుకోవడం గమనార్హం. ఏపీఎల్ అపోలో, హల్దీరామ్ జట్టును కొనుగోలు చేసేందుకు ఉత్సాహంతో ఉన్నాయి.సీల్డ్ బిడ్లను జనవరి 25న ఓపెన్ చేసి బీసీసీఐ ఫ్రాంచైజీ విన్నర్లను ప్రకటించనుంది.
Mohan Raja : భాషతో సంబంధం లేదు.. భావమే ముఖ్యం
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!