ఆ విషయమై బీసీసీఐతో మాట్లాడతా: పీసీబీ చీఫ్ నజామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్-2023కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఒకవేళ టోర్నీని పాక్లో జరిపితే టీమిండియా అక్కడికు వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ జై షా స్పష్టం చేశారు. టోర్నీ వేదికను మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దీనిపై నాటి పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా కూడా స్పందిస్తూ.. పాక్లో టీమిండియా ఆడకపోతే, ప్రపంచకప్లో పాక్ ఆడదని కౌంటర్ ఇచ్చాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇటీవలే రమీజ్ రాజా పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగగా ప్రస్తుతం ఛైర్మన్గా నజామ్ సేథీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ విషయమై జై షాతో తప్పకుండా భేటీ అవుతానని ఇప్పటికే ప్రకటించారు. ఏసీసీ మీటింగ్ సమయంలో జై షాతో ప్రత్యేకంగా సమావేశమవుతానని సేథీ వెల్లడించారు.
Mass Maharaja Raviteja: ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్కు పూనకాలే..
Also Read
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
“ఆసియా కప్ కౌన్సిల్ అధికారులను కలిసే సమయం వచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీన బహ్రెయిన్ వేదికగా ఏసీసీ మీటింగ్ జరగనుంది. ప్రస్తుతం మా బోర్డు వైఖరిని తెలియజేసేందుకు ఇదొక అవకాశం. ఇది పాకిస్థాన్ క్రికెట్కు సాయపడుతుందని భావిస్తున్నా. భారత్లో పాకిస్తా్న్ పర్యటించాలని బీసీసీఐ కోరుకుంటుంది. కానీ పాక్లో ఆడేందుకు మాత్రం అంగీకరించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు మాకు కొత్తేమీకాదు. దీనిపై తప్పకుండా మాట్లాడతా” అని నజామ్ సేథీ తెలిపారు.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!