Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
- కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో చోటు లేదు
- వన్డే సిరీస్లో మూల్యం చెల్లించుకున్న టీమిండియా
- ఇక కుల్దీప్ రిటైర్ అవవడమే బెటరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో కూడా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో చోటు దక్కలేదు. సిరీస్లోని మొదటి రెండు మ్యాచ్లలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కారణంగా కుల్దీప్కు ప్లేయింగ్ 11లో ఆడలేదు. గాయం కారణంగా సుందర్ మూడో మ్యాచ్లో ఆడకున్నా.. కుల్దీప్కు అవకాశం రాలేదు. లార్డ్స్ మైదానంలో యువకులను ఆడించిన టీమిండియా మూల్యం చెల్లించుకుంది. కుల్దీప్కు అవకాశం రాకపోవడంపై మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు గుప్పించిన కైఫ్.. వరుసగా అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెడుతుంటే కుల్దీప్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని సూచిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా కుల్దీప్ యాదవ్కు జట్టులో చోటు కల్పించకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కైఫ్ పేర్కొన్నాడు. ‘కుల్దీప్ యాదవ్ ఇప్పుడు తన బ్యాగులు సర్దుకుని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాలా అనే ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బుమ్రా లేడు, వాషింగ్టన్ లేడు, వరుణ్ కూడా లేడు. అయినా కుల్దీప్కు తుది జట్టులో స్థానం దక్కలేదు. లార్డ్స్లో భారత బౌలింగ్ ఒకే తరహాలో కనిపించింది. ఎడమచేతి రిస్ట్ స్పిన్నర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగపడేవాడు. 118 వన్డేల్లో 194 వికెట్లు తీసిన రికార్డులు కూడా ఇప్పుడు విలువలేనివిగా కనిపిస్తున్నాయి’ అని ‘ఎక్స్’లో కైఫ్ రాసుకొచ్చాడు.
Also Read
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
కుల్దీప్ను వరుసగా పక్కన పెట్టడంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఫైర్ అయ్యాడు. ‘కుల్దీప్ను ఆడించకపోవడానికి బ్యాటింగ్ డెప్త్ అవసరమనే కారణం చెప్పారు. కానీ ఇప్పుడు అర్ష్దీప్ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. బుమ్రా కూడా లేని సమయంలో కుల్దీప్కు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. ఇలాంటి నిర్ణయాలు బౌలర్ ఆత్మవిశ్వాసం, లయపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’ అని యాష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో కుల్దీప్కు టీ20 సిరీస్లో విశ్రాంతిని ఇచ్చింది. వన్డే సిరీస్లో ఉన్నా కూడా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మూడు వన్డేల్లోనూ అతను బెంచ్కే పరిమితమయ్యాడు.
జట్టు యాజమాన్యం బ్యాటింగ్ డెప్త్ కోసం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకు ప్రాధాన్యం ఇస్తుండగా.. కుల్దీప్ ప్రధాన బలం అయిన స్పిన్ బౌలింగ్కు తగిన గుర్తింపు దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 118 వన్డేల్లో 194 వికెట్లు సాధించిన కుల్దీప్.. భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన మ్యాచ్ విన్నర్గా గుర్తింపు పొందాడు. అయినప్పటికీ వరుసగా అవకాశాలు దక్కకపోవడంతో అతని భవిష్యత్తుపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మహ్మద్ కైఫ్, రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు జట్టు ఎంపిక విధానంపై మరోసారి చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!