Team India: వన్డే వరల్డ్ కప్లో రోహిత్- కోహ్లీని ఆడించకపోవడం మంచిది కాదు..
- హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- గంభీర్ కోచ్గా వచ్చినప్పటికీ నుంచి సీరియర్లు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు..
- వన్డే వరల్డ్ కప్ లో రోహిత్- కోహ్లీని ఆడించకపోవడం మంచిది కాదు: మనోజ్ తివారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడించాలి.. లేకపోతే అది పెద్ద తప్పిదమే అవుతుందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ పేర్కొన్నారు. అలాగే, గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చినప్పటి నుంచే జట్టుకు సీనియర్ ప్లేయర్స్ దూరం అవుతున్నారు.. తన నిర్ణయాలకు అడ్డు రావడంతోనే గంభీర్.. అశ్విన్, రోహిత్, విరాట్ను జట్టులో లేకుండా చేశాడని తివారీ సంచలన ఆరోపణలు చేశాడు.
Read Also: Vizianagaram: పైడితల్లి అమ్మవారి దర్శనాల్లో వీఐపీలకే అధిక ప్రాధాన్యతపై భక్తుల్లో ఆగ్రహం
Also Read
- BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
- Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
- Harry Brook: "టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే".. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
- Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే 'అగ్ని పరీక్ష'!
ఇక, గత ఏడాది భారత్- ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే, రోహిత్, కోహ్లీ సైతం 2025 మేలో ఒకరి తర్వాత మరొకరు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పారు. వీరిద్దరూ ఇంతకు ముందే టీ20లకు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డే క్రికెట్లో మాత్రమే ఆడుతున్నారు. ఒకవేళ జట్టులో సీనియర్ ప్లేయర్స్ అశ్విన్, రోహిత్, కోహ్లీ ఉంటే.. కోచ్గా గౌతమ్ గంభీర్ తీసుకున్న ఏ నిర్ణయాన్ని తమకు నచ్చకుంటే వారు ప్రశ్నించే ఛాన్స్ ఉంది అని మనోజ్ తివారీ పేర్కొన్నారు. వాళ్లు లేకపోతే ఎలాంటి సమస్య ఉండదు కదా.. గౌతమ్ గంభీర్ హెడ్కోచ్గా వచ్చినప్పటి నుంచి చాలా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇది భారత క్రికెట్కు అంత మంచిది కాదు అన్నాడు. గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాతే స్టార్ ప్లేయర్స్ ఊహించని విధంగా రిటైర్మెంట్లు ప్రకటించారు. దీంతో పలువురు ఆటగాళ్లు స్వ్కాడ్లోకి, ఆ తర్వాత నేరుగా తుది జట్టులోకి వచ్చేస్తున్నారు. తివారీ ఆరోపించాడు.
Read Also: Dhanush : సినిమా రిలీజయి నెల కాకముందే.. ఓటీటీలోకి ధనుష్ హిట్ మూవీ
అయితే, రోహిత్, విరాట్ కోహ్లీ టీమిండియా కోసం ఎంతో చేశారు అని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తెలిపారు. కానీ, ప్రస్తుతం వారిని గంభీర్ ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఒకవేళ వారిద్దరినీ వన్డే వరల్డ్ కప్ 2027లో కోచ్ ఆడించకుంటే.. అది పెద్ద తప్పిదమే అన్నారు. తమ గౌరవానికి భంగం కలుగుతోందని భావిస్తే రోహిత్, విరాట్.. డ్రెస్సింగ్ రూంలో ఉండటానికి అస్సలు ఇష్టపడరు.. బహుశా వారు రిటైర్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ అలా జరగొద్దు, వారు ఇంకా క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటున్నా.. గంభీర్ కూడా ఈ విషయంలో వెనకడుగు వేస్తాడు.. ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్లో రో- కో అద్భుతమైన ఆటగాళ్లని మనోజ్ తివారీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!