నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్కత్తా నైట్రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఈ మ్యాచ్లో ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ ఆటగాళ్ల ఆది నుంచి తడబడినట్లు కనిపించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలని పట్టుమీదున్న ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగారు. దీంతో కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది.
10 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. అయితే 18 ఓవర్ల 5 బంతులకే కేకేఆర్ జట్టును ఆలౌట్ చేసింది బెంగళూరు జట్టు. ఆండ్రీ రసెల్ 25 పరుగులు, చివర్లో ఉమేశ్ యాదవ్ 18 పరుగులు, వరుణ్ చక్రవర్తి 10 పరుగులు నాటౌట్ సాధించడంతో కేకేఆర్ స్వల్ప స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా 4, ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ తీశాడు.