Virat Kohli: విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు: డుప్లెసిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోర్నీ తొలి అర్ధభాగంలో తమ జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడని, ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయన్నాడు. ఇటీవలి రెండు మ్యాచ్ల్లో తాము విజయానికి దగ్గరగా వచ్చామని, కానీ జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం గెలవాల్సిందే అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. వరుసగా ఆరు ఓటములతో సతమతమైన బెంగళూరు.. ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ను వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో ఓడించింది.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ… ‘గత రెండు మ్యాచ్ల్లోనూ మేం గొప్పగా పోరాడాం. హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్ష్యం 270కి పైగా ఉంటే.. 260 పరుగులు చేశాం. కోల్కతాపై ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండు మ్యాచ్ల్లో మేం విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. అయితే జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం విజయం సాదించాల్సిందే. మాటలతో ఎవరిలోనూ విశ్వాసం పెంచలేం. మన ప్రదర్శనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’ అని అన్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
Also Read: Vijaysai Reddy: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా!
‘టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయి. మనం 100శాతం ప్రదర్శన ఇవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. టోర్నీ తొలి అర్ధభాగంలో మా జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు. ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారు. కామెరూన్ గ్రీన్ ఫామ్లోకి రావడం జట్టుకు అదనపు బలం’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం కోహ్లీ వద్దే ఉంది. ఈ సీజన్లో అతడు 430 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో విరాట్ 400 రన్స్ మార్క్ దాటడం ఇది పదోసారి కావడం విశేషం.
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!