Virat Kohli: విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు: డుప్లెసిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోర్నీ తొలి అర్ధభాగంలో తమ జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడని, ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయన్నాడు. ఇటీవలి రెండు మ్యాచ్ల్లో తాము విజయానికి దగ్గరగా వచ్చామని, కానీ జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం గెలవాల్సిందే అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. వరుసగా ఆరు ఓటములతో సతమతమైన బెంగళూరు.. ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ను వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో ఓడించింది.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ… ‘గత రెండు మ్యాచ్ల్లోనూ మేం గొప్పగా పోరాడాం. హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్ష్యం 270కి పైగా ఉంటే.. 260 పరుగులు చేశాం. కోల్కతాపై ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండు మ్యాచ్ల్లో మేం విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. అయితే జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం విజయం సాదించాల్సిందే. మాటలతో ఎవరిలోనూ విశ్వాసం పెంచలేం. మన ప్రదర్శనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’ అని అన్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Vijaysai Reddy: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా!
‘టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయి. మనం 100శాతం ప్రదర్శన ఇవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. టోర్నీ తొలి అర్ధభాగంలో మా జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు. ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారు. కామెరూన్ గ్రీన్ ఫామ్లోకి రావడం జట్టుకు అదనపు బలం’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం కోహ్లీ వద్దే ఉంది. ఈ సీజన్లో అతడు 430 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో విరాట్ 400 రన్స్ మార్క్ దాటడం ఇది పదోసారి కావడం విశేషం.
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!