Virat Kohli: విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు: డుప్లెసిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోర్నీ తొలి అర్ధభాగంలో తమ జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడని, ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయన్నాడు. ఇటీవలి రెండు మ్యాచ్ల్లో తాము విజయానికి దగ్గరగా వచ్చామని, కానీ జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం గెలవాల్సిందే అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. వరుసగా ఆరు ఓటములతో సతమతమైన బెంగళూరు.. ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ను వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో ఓడించింది.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ… ‘గత రెండు మ్యాచ్ల్లోనూ మేం గొప్పగా పోరాడాం. హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్ష్యం 270కి పైగా ఉంటే.. 260 పరుగులు చేశాం. కోల్కతాపై ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండు మ్యాచ్ల్లో మేం విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. అయితే జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం విజయం సాదించాల్సిందే. మాటలతో ఎవరిలోనూ విశ్వాసం పెంచలేం. మన ప్రదర్శనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’ అని అన్నాడు.
Also Read
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
Also Read: Vijaysai Reddy: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా!
‘టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయి. మనం 100శాతం ప్రదర్శన ఇవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. టోర్నీ తొలి అర్ధభాగంలో మా జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు. ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారు. కామెరూన్ గ్రీన్ ఫామ్లోకి రావడం జట్టుకు అదనపు బలం’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం కోహ్లీ వద్దే ఉంది. ఈ సీజన్లో అతడు 430 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో విరాట్ 400 రన్స్ మార్క్ దాటడం ఇది పదోసారి కావడం విశేషం.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!