Virat Kohli: విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు: డుప్లెసిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోర్నీ తొలి అర్ధభాగంలో తమ జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడని, ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయన్నాడు. ఇటీవలి రెండు మ్యాచ్ల్లో తాము విజయానికి దగ్గరగా వచ్చామని, కానీ జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం గెలవాల్సిందే అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. వరుసగా ఆరు ఓటములతో సతమతమైన బెంగళూరు.. ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ను వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో ఓడించింది.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ… ‘గత రెండు మ్యాచ్ల్లోనూ మేం గొప్పగా పోరాడాం. హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్ష్యం 270కి పైగా ఉంటే.. 260 పరుగులు చేశాం. కోల్కతాపై ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండు మ్యాచ్ల్లో మేం విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. అయితే జట్టులో విశ్వాసం నిండాలంటే మాత్రం విజయం సాదించాల్సిందే. మాటలతో ఎవరిలోనూ విశ్వాసం పెంచలేం. మన ప్రదర్శనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’ అని అన్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
Also Read: Vijaysai Reddy: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా!
‘టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇతర జట్లు చాలా బలంగా ఉన్నాయి. మనం 100శాతం ప్రదర్శన ఇవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. టోర్నీ తొలి అర్ధభాగంలో మా జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు. ఇప్పుడు మిగతా ప్లేయర్స్ రాణిస్తున్నారు. కామెరూన్ గ్రీన్ ఫామ్లోకి రావడం జట్టుకు అదనపు బలం’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం కోహ్లీ వద్దే ఉంది. ఈ సీజన్లో అతడు 430 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో విరాట్ 400 రన్స్ మార్క్ దాటడం ఇది పదోసారి కావడం విశేషం.
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!