Shreyas Iyer-PBKS Wis: మా విజయ రహస్యం అదే.. అసలు విషయం చెప్పేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్!
- ఐపీఎల్ 2026లో ఓటమి ఎరుగని జట్టు పంజాబ్
- ఆరు మ్యాచ్లలో ఐదు గెలవగా, ఓ మ్యాచ్ రద్దు
- పంజాబ్ విజయ రహస్యం చెప్పిన కెప్టెన్ శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందంటే.. అది పీబీకేఎస్ టీమ్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు గెలవగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ వరుస విజయాలకు కారణం ఏంటో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. తాను ప్రత్యేకంగా ఎలా ఆడాలనే సూచనలు ఆటగాళ్లకు ఇవ్వనని, వారు తమ శైలిలో ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతానని తెలిపాడు. మ్యాచ్కు ముందు కోచ్ రికీ పాంటింగ్ ప్రోత్సహిస్తారని, తాను కొన్ని మాటలు చెప్పి జట్టును ఉత్తేజపరుస్తానని శ్రేయస్ చెప్పాడు.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ బాగా ఆడారు. ఇద్దరి భాగస్వామ్యం అద్భుతం. కొన్ని షాట్లు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్ఫుట్పై స్ట్రైట్గా ఆడటం, స్పిన్నర్లను కూడా అదే ధైర్యంతో ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. ధైర్యం, నిలకడ రెండూ అవసరం. ఎందుకంటే మ్యాచ్ ఎప్పుడైనా చేతిలో నుంచి జారిపోవచ్చు. కానీ ఇద్దరు మిడిల్ ఓవర్లలో ఆ భాగస్వామ్యాన్ని నిర్మించిన తీరు అద్భుతం. ఇప్పుడే కూపర్, ప్రియాంశ్తో మాట్లాడుతున్నాను. ఈ ఐపీఎల్లో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారో అనే పోటీ పెట్టుకుందాం అనుకున్నాం. మేమంతా సిద్ధంగా ఉన్నాం. గెలిచిన వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తాను. వాళ్లు బాగా ఆడినా, నేనూ బాగా ఆడితే నాకు సంతోషమే’ అని చెప్పాడు.
Also Read
- Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!
- Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!
- Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
- KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
‘నా అభిప్రాయం ప్రకారం ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేస్తేనే ప్రతిభను బయటపెడతారు. అదే మా జట్టు మంత్రంగా మారింది. ప్రతి ఒక్కరికి తమ తమ విధానాలు, అలవాట్లు ఉంటాయి. వాటితోన ప్లేయర్స్ ఫలితాలు సాధిస్తున్నారు. కాబట్టి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడుకుంటాం, మ్యాచ్కు ముందు రికీ మోటివేట్ చేస్తాడు. నేనూ కొద్దిగా మాట్లాడుతా. తర్వాత ఆటగాళ్లు మైదానంలో ఫలితం చూపిస్తారు. మా జట్టులో ఉన్న బౌలర్లలో చాలా మంది అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు. వాళ్లు తమ దేశాల తరఫున అద్భుతంగా రాణించారు. అనుభవం కూడా చాలా ఉంది. కాబట్టి వారికి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ప్రత్యేకంగా కొనరు బ్యాటర్లకు వ్యూహాలు రూపొందిస్తాం. తర్వాత అమలు చేయడమే ముఖ్యం. ఈరోజు వారు బౌలింగ్ చేసిన తీరు, ఈ సీజన్ మొత్తం చూపుతున్న ప్రదర్శన నిజంగా అద్భుతం. ఇలానే కొనసాగాలి. ఇప్పటివరకు అన్నీ బాగా జరుగుతున్నాయి’ అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
-
Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
-
Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
-
Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!
-
Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్గా కరకరలాడే వడలు