Site icon NTV Telugu

Sai Sudharsan: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. ఐపీఎల్ హిస్టరీలో నయా రికార్డ్.. క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్

Sai Sudarshan

Sai Sudarshan

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 24) జరిగే 34వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. సాయి సుదర్శన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు సుదర్శన్.

సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. గిల్ (32), సాయి తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుజరాత్ కెప్టెన్‌ను సుయాష్ శర్మ క్యాచ్ పట్టాడు. ఈలోగా, సాయి కేవలం 57 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు, ఐపీఎల్‌లో ఇది మూడో సెంచరీ. సాయి సుదర్శన్ 33 బంతుల్లో సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేసుకోగా, 57 బంతుల్లో శతకం సాధించాడు. సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగాడు.

Exit mobile version