Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
- ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి
- ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag reacted strongly to personal criticism: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026లో మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న పరాగ్.. తన ఆటపైనే కాదు, వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపై గట్టిగా స్పందించాడు. కొంతమంది కామెంటేటర్లు, సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారిపై అసహనం వ్యక్తం చేశాడు. ఎవరైనా సరే క్రికెట్ గురించి మాట్లాడాలని, ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయవద్దని స్పష్టం చేశాడు. మేము కూడా మనుషులమే అని, తప్పులు జరుగుతాయని పరాగ్ పేర్కొన్నాడు.
ఇటీవల వేపింగ్ వివాదం కారణంగా రియాన్ పరాగ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో విమర్శలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘గత నాలుగేళ్లలో నేను ఓ విషయం అర్థం చేసుకున్నా. నేను ఏం చేసినా ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ మాటలు నా ఆటపై, ఫామ్పై, మైండ్సెట్పై ప్రభావం చూపకూడదని నేర్చుకున్నా. కీబోర్డ్ వారియర్స్ (ట్రోలర్స్) ఎప్పుడూ ఉంటారు. వాళ్ల మాటలను బయటే వదిలేయాలి. నా ఆటపై నాకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలుసు. అలాంటి కామెంట్లు నా ఆటను దెబ్బతీయకూడదు’ అని పరాగ్ చెప్పాడు.
Also Read
- Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
- Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ఈ ఐపీఎల్ సీజన్లో మైదానం బయట చాలా విషయాలు జరుగుతున్నాయని, కానీ భారతదేశంలో ప్రజలు క్రికెట్ను ఎంతగా ప్రేమిస్తారో తమకు తెలుసని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. ‘మైదానానికి వచ్చే అభిమానుల కోసం మేము మా శక్తివంచన లేకుండా ఆడతాం. ప్రతి మ్యాచ్కు ముందు మేము ఎంతో కష్టపడతాం. ఒక జట్టు 75 లేదా 80 పరుగులకు ఆలౌట్ అయితే.. వాళ్లకు ఆడటం రాదని చెప్పడం చాలా ఈజీ. కానీ ఆ మ్యాచ్కు ముందు మూడు, నాలుగు రోజుల పాటు ఎంత కష్టపడతామో ఎవరికీ తెలియదు. 220, 250 పరుగులు చేయాలనే ప్లాన్తో మైదానంలోకి దిగుతాం. కానీ ప్రతిసారి అనుకున్నట్లు జరగదు. మేము కూడా మనుషులమే. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఎవరూ ఉండరు’ అని తెలిపాడు.
కామెంటేటర్లపై కూడా రియాన్ పరాగ్ తీవ్ర స్థాయిలో స్పందించాడు. ‘మ్యాచ్ సమయంలో కామెంటరీ బాక్స్లో ఉండే వాళ్ల మాటలు ప్రజలకు ఎక్కువగా చేరతాయి. అందుకే వాళ్లకు ఓ అభ్యర్థన చేస్తున్నా. క్రికెట్ను ప్రేమించండి, క్రికెట్ గురించే మాట్లాడండి. ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల గురించి దయచేసి మాట్లాడకండి. భారతదేశంలో క్రికెట్ చాలా ముఖ్యమైన ఆట. ప్రపంచంలోనే మేము అత్యుత్తమంగా ఉన్నాం. అలాంటి ఆటకు గౌరవం ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశాడు. లక్నోపై విజయం సాధించిన రాజస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఓడినా కూడా ఇతర జట్ల ఫలితాల ఆధారంగా అవకాశాలు ఉండనున్నాయి.
తాజావార్తలు
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
-
Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? ‘డ్రాగన్’ గ్లింప్స్ రివ్యూ!
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్కు జాక్పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?