Rishabh Pant: మరోసారి వేలంలోకి రిషబ్ పంత్
- మరోసారి వేలంలోకి రిషబ్ పంత్..
- ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం పేరు రిజిస్టర్..
- ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులో ఛాన్స్ వస్తుందని పంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: టీమిండియా డైనమిక్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో అదరగొడుతున్నాడు. తను టీ20లో ఆడినట్లే టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆడి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అయితే, గత ఐపీఎల్ సీజన్ లో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం అతడికి 27 కోట్ల పైగా ఇచ్చి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ పెయిడ్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఇప్పుడు మరోసారి వేలంలోకి రాబోతున్నాడు పంత్.
Read Also: Bengaluru Victory Parade: ఆర్సీబీ ఫ్రాంచైజీకి భారీ షాక్..
Also Read
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
అయితే, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం జులై 6, 7వ తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దీంతో ఈ సీజన్లో తాను ఎలాగైనా ఆడాలని చెప్పి తన పేరును కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎందుకంటే గత సీజన్లో ఆరు జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ, ఈ సీజన్లో మరో రెండు జట్లు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరింత రసవత్తరంగా సాగనుంది. అందులోనూ ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక, రిషబ్ పంత్ తో పాటు మరి కొందరూ ఐపీఎల్ స్టార్లు కూడా ఈ సీజన్లో ఆడనున్నారు. మరీ ముఖ్యంగా గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కి ఆడిన యంగ్ సెన్సేషన్ దిగ్వేష్ రాటి. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రానా మరియు మయాంక్ యాదవ్ లాంటి ప్లేయర్లు కూడా ఈ వేలంలోకి రానున్నారు. కాగా, దిగ్వేష్ రాటి, ప్రియాన్ష్ ఆర్య ఇక్కడే అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ సీజన్లో ఛాన్స్ కూడా కొట్టేశారు.
Read Also: ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రిషబ్ పంత్ మొదటి టెస్టులోనే అదరగొట్టాడు. ఆడిన రెండు ఇన్నింగ్స్ లోను రెండు సెంచరీలతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక, ఇప్పటికే ఐపిఎల్ ఆక్షన్ లో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ ఈ వేలంలో ఎంత వరకు వెళ్తాడో చూడాలి.
తాజావార్తలు
-
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!