Rishabh Pant: మరోసారి వేలంలోకి రిషబ్ పంత్
- మరోసారి వేలంలోకి రిషబ్ పంత్..
- ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం పేరు రిజిస్టర్..
- ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులో ఛాన్స్ వస్తుందని పంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: టీమిండియా డైనమిక్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో అదరగొడుతున్నాడు. తను టీ20లో ఆడినట్లే టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆడి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అయితే, గత ఐపీఎల్ సీజన్ లో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం అతడికి 27 కోట్ల పైగా ఇచ్చి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ పెయిడ్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఇప్పుడు మరోసారి వేలంలోకి రాబోతున్నాడు పంత్.
Read Also: Bengaluru Victory Parade: ఆర్సీబీ ఫ్రాంచైజీకి భారీ షాక్..
Also Read
- Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
- IPL Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం.. ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ఛాన్సెస్.. ఆ 3 జట్లకు మాత్రం!
- GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
- Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
అయితే, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం జులై 6, 7వ తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దీంతో ఈ సీజన్లో తాను ఎలాగైనా ఆడాలని చెప్పి తన పేరును కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎందుకంటే గత సీజన్లో ఆరు జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ, ఈ సీజన్లో మరో రెండు జట్లు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరింత రసవత్తరంగా సాగనుంది. అందులోనూ ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక, రిషబ్ పంత్ తో పాటు మరి కొందరూ ఐపీఎల్ స్టార్లు కూడా ఈ సీజన్లో ఆడనున్నారు. మరీ ముఖ్యంగా గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కి ఆడిన యంగ్ సెన్సేషన్ దిగ్వేష్ రాటి. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రానా మరియు మయాంక్ యాదవ్ లాంటి ప్లేయర్లు కూడా ఈ వేలంలోకి రానున్నారు. కాగా, దిగ్వేష్ రాటి, ప్రియాన్ష్ ఆర్య ఇక్కడే అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ సీజన్లో ఛాన్స్ కూడా కొట్టేశారు.
Read Also: ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రిషబ్ పంత్ మొదటి టెస్టులోనే అదరగొట్టాడు. ఆడిన రెండు ఇన్నింగ్స్ లోను రెండు సెంచరీలతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక, ఇప్పటికే ఐపిఎల్ ఆక్షన్ లో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ ఈ వేలంలో ఎంత వరకు వెళ్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!