Riyan Parag: ఐపీఎల్లో రియాన్ పరాగ్ చరిత్ర.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Eye on Rishabh Pant’s IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో రియాన్ 13 ఇన్నింగ్స్ల్లో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ అద్భుత విజయాలు అందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ (36; 26 బంతుల్లో, 2×4, 2×6) ఆడాడు.
ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు. 2018 సీజన్లో పంత్ 579 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రియాన్ పరాగ్ (567), రోహిత్ శర్మ (538 రన్స్, 2013), గ్లెన్ మాక్స్వెల్ (513 రన్స్, 2021), దినేశ్ కార్తీక్ (498 రన్స్, 2018) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బెంగళూరు మ్యాచ్తో రోహిత్ రికార్డును రియాన్ పరాగ్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండటంతో.. పంత్ రికార్డును పరాగ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: RCB vs RR Eliminator 2024: బెంగళూరు ఓటమిపై సెటైర్.. చెన్నై ఆటగాడిపై తీవ్ర విమర్శలు!
అసోంకి చెందిన 22 ఏళ్ల రియాన్ పరాగ్.. 2020లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ను గెలిపించిన తర్వాత రాహుల్ తెవాతియాతో కలిసి డ్యాన్స్ చేయడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఎప్పుడో ఓసారి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ.. నెట్టింట ఎక్కువగా రచ్చ చేశాడు. దాంతో ఓవరాక్షన్ స్టార్ అని నెటిజెన్స్ ఓ బిరుదు కూడా ఇచ్చేశారు. ఐపీఎల్ 2023లో 7 ఇన్నింగ్స్ల్లో 70 పరుగులు మాత్రమే చేయడంతో తుది జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. రూ.3.8 కోట్లు పెట్టుబడి పెట్టిన రాజస్థాన్ ప్రాంచైజీకి నిరాశే ఎదురైంది. అయితే దేవ్ధార్ ట్రోఫీ (354), సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో (510) అదరగొట్టిన పరాగ్.. అదే ఫామ్ను ఐపీఎల్ 2024లోనూ కొనసాగిస్తున్నాడు.
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!