Riyan Parag: ఐపీఎల్లో రియాన్ పరాగ్ చరిత్ర.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Eye on Rishabh Pant’s IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో రియాన్ 13 ఇన్నింగ్స్ల్లో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ అద్భుత విజయాలు అందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ (36; 26 బంతుల్లో, 2×4, 2×6) ఆడాడు.
ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు. 2018 సీజన్లో పంత్ 579 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రియాన్ పరాగ్ (567), రోహిత్ శర్మ (538 రన్స్, 2013), గ్లెన్ మాక్స్వెల్ (513 రన్స్, 2021), దినేశ్ కార్తీక్ (498 రన్స్, 2018) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బెంగళూరు మ్యాచ్తో రోహిత్ రికార్డును రియాన్ పరాగ్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండటంతో.. పంత్ రికార్డును పరాగ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
Also Read: RCB vs RR Eliminator 2024: బెంగళూరు ఓటమిపై సెటైర్.. చెన్నై ఆటగాడిపై తీవ్ర విమర్శలు!
అసోంకి చెందిన 22 ఏళ్ల రియాన్ పరాగ్.. 2020లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ను గెలిపించిన తర్వాత రాహుల్ తెవాతియాతో కలిసి డ్యాన్స్ చేయడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఎప్పుడో ఓసారి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ.. నెట్టింట ఎక్కువగా రచ్చ చేశాడు. దాంతో ఓవరాక్షన్ స్టార్ అని నెటిజెన్స్ ఓ బిరుదు కూడా ఇచ్చేశారు. ఐపీఎల్ 2023లో 7 ఇన్నింగ్స్ల్లో 70 పరుగులు మాత్రమే చేయడంతో తుది జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. రూ.3.8 కోట్లు పెట్టుబడి పెట్టిన రాజస్థాన్ ప్రాంచైజీకి నిరాశే ఎదురైంది. అయితే దేవ్ధార్ ట్రోఫీ (354), సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో (510) అదరగొట్టిన పరాగ్.. అదే ఫామ్ను ఐపీఎల్ 2024లోనూ కొనసాగిస్తున్నాడు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!