Adam Zampa-IPL 2024: మ్యాచ్లు ఆడలేను.. ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Royals Spinner Adam Zampa Ruled Out of IPL 2024: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి తాను తప్పుకొన్నట్లు ప్రకటించాడు. గతేది కాలంగా నిరంతర క్రికెట్ ఆడుతున్నానని, శరీరం కొంత విశ్రాంతి కోరుకుంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జంపా తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024పై దృష్టి సారించడానికి ఈ విశ్రాంతి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. వచ్చే జూన్లో వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ఆస్ట్రేలియా గెలవడంతో జంపా కీలక పాత్ర పోచించిన విషయం తెలిసిందే.
విల్లో టాక్ పోడ్కాస్ట్తో ఆడమ్ జంపా మాట్లాడుతూ… ‘ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది ప్రపంచకప్ సంవత్సరం. ఈ ఏడాది చాలా ముఖ్యమైనదిని నేను భావిస్తున్నాను. గత ఏడాది పూర్తి ఐపీఎల్ ఆడాను. భారత్లో వన్డే ప్రపంచకప్ కోసం మూడు నెలలు ఉన్నాను. చాలా అలసి పోయాను. అయినా ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడాలనుకున్నా. కానీ రాజస్థాన్ రాయల్స్కు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేనని అర్ధమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపాడు.
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
Also Read: Rajamouli-Rama Dance: ఆల్టైమ్ హిట్ పాటకు రాజమౌళి, రమ డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్!
‘టీ20 ప్రపంచకప్కు సిద్ధం కావడానికి ఐపీఎల్ 2024 ద్వారా నాకు 14 గేమ్లు ఉన్నాయి. అయితే తుది జట్టులో ఉన్న పోటీ కారణంగా నేను ఎన్ని గేమ్లు ఆడుతానో తెలియదు. అందుకే ఐపీఎల్ 2024 ఆడడం కన్నా.. నేను నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం, నా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిదని నిర్ణయించుకున్నా. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఎందుకంటే తదుపరి సీజన్ ఆడేలోపు ఏం జరుగుతుంది, ఫాన్స్ స్వాగతిస్తారా? అన్న ప్రశ్నలు మనస్సులో మెదిలాయి. టీ20 ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆడమ్ జంపా చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ రూ. 2.25 కోట్లకు జంపాను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023లో అతడు 6 మ్యాచ్లు ఆడాడు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్ జట్టులో ఉండడంతో తుది జట్టులో స్థానం కోసం పోటీ పడవలసి వచ్చింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..