Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli World Record: విరాట్ కోహ్లీ మరోసారి తన పేరును చరిత్ర పుస్తకాలలో నిలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పెద్దగా పరుగులు చేయకపోయినా, కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యార్ కలిసి ఆరంభంలో వేగంగా పరుగులు సాధించారు. కోహ్లీ 11 బంతుల్లో 15 పరుగులు చేయగా, వెంకటేష్ అయ్యర్ కేవలం 19 బంతుల్లోనే 44 పరుగులు బాదాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇద్దరూ పవర్ప్లేలో వేగంగా ఆడటంతో ఆర్సీబీ కేవలం 3.5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది.
ఈ భాగస్వామ్యంతో కోహ్లీ టీ20 క్రికెట్లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో పాల్గొన్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలెక్స్ హేల్స్ పేరిట ఉండేది. మ్యాచ్కు ముందు ఇద్దరూ 210 భాగస్వామ్యాలతో సమంగా ఉండగా, హైదరాబాద్ మ్యాచ్లో కోహ్లీ అతడిని అధిగమించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
టీ20ల్లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో పాల్గొన్న ఆటగాళ్లు
211 – విరాట్ కోహ్లీ
210 – అలెక్స్ హేల్స్
200 – డేవిడ్ వార్నర్
196 – బాబర్ ఆజమ్
191 – క్రిస్ గేల్
మరోవైపు.. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, హెడ్ మధ్య సరదా మాటల యుద్ధం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ట్రావిస్ హెడ్ను బౌలింగ్ చేయమంటూ కోహ్లీ సరదాగా సైగలు చేయడం కనిపించింది. అనంతరం హెడ్ బౌలింగ్లోనే ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ ఔటయ్యాడు. మ్యాచ్ అనంతరం కూడా ఇద్దరి మధ్య హీట్ తగ్గినట్టు కనిపించలేదని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ 56 పరుగులు, ఇషాన్ కిషన్ 79 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 51 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 29 పరుగులతో రాణించారు. అయితే టాప్-2 స్థానాన్ని దక్కించుకోవాలంటే ఎస్ఆర్హెచ్ కనీసం 90 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండగా, ఆర్సీబీ బ్యాట్స్మెన్ చివర్లో సమర్థవంతంగా ఆడి ఆ అవకాశాన్ని దూరం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!