Trevor Penney: వైభవ్ సూర్యవంశీ చాలా ఫీల్ అయ్యాడు.. కోచ్ ట్రెవర్ పెన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trevor Penney: ఈ సీజన్లో రాజస్థాన్ దూకుడు మామూలుగా లేదు. నిన్న జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన మ్యాచ్లో దూకుడుకు ఒక్కసారిగా బ్రేట్ పడింది. ఆర్ఆర్ టీమ్ అంటేనే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ గుర్తుకు వస్తాడు. స్టార్ పేసర్లు సైతం వైభవ్ను కట్టడి చేయలేకపోయారు. ఐపీఎల్ 2026లో అత్యధిక స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు వైభవ్. ఇప్పటికే 15 బంతుల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఎస్ఆర్హెచ్ మ్యాచుకు ముందు ఆడిన మొదటి నాలుగు ఐపీఎల్ 2026 మ్యాచ్లలో సూర్యవంశీ వరుసగా 52, 31, 39, 78 స్కోర్లు సాధించాడు. అయితే, సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీకి ప్రఫుల్ హింగే కళ్లెం వేశాడు. ఇదిలా ఉండగా.. నిన్నటి మ్యాచ్లో వైభవ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రాజస్థాన్ రాయల్స్ సహాయ కోచ్ ట్రెవర్ పెన్నీ (Trevor Penney) సమాధానమిచ్చారు. “గత మ్యాచ్లో ఫీల్డింగ్కు దూరమైనప్పుడు వైభవ్ సూర్య వంశీ చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అతనికి ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. చాలా మంచిగా ఫీల్డింగ్ చేస్తాడు. కానీ టీమ్ కాంబినేషన్ కారణంగా అతడిని ఫీల్డింగ్కు దించలేకపోయాం. దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో కాలర్ బోన్ గాయంతో దూరమైన గన్ ఫీల్డర్ డోనోవన్ ఫెరీరా తిరిగి ఫిట్నెస్ సాధించడంతో అతడిని తుది జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే వైభవ్ ఫీల్డింగ్లో భాగం కాలేకపోయాడు. ఫీల్డింగ్లో రాణించలేకపోవడం వల్లే తీసుకోలేదనే వాదన తప్పు.” అని ట్రెవర్ పెన్నీ (Trevor Penney) వివరించారు.
READ MORE: Telugu Cinema : రూట్ మారుస్తోన్న టాలీవుడ్ హీరోలు.. పీరియాడిక్ కథలపై ఫోకస్
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
ఇదిలా ఉండగా.. నిన్న జరిగిన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్రైజర్స్ 216 లక్ష్యాన్ని నిర్దేశించగా.. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ తడబడింది. విదర్భ పేసర్ ప్రఫుల్ హింగే, బీహార్ పేసర్ సాకిబ్ హుస్సేన్ అద్భుతమైన బౌలింగ్తో రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ 159 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో ఆర్ఆర్ వరుస విజయాలకు అడ్డుకట్ట పడినప్పటికీ, పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ఈ అద్భుత విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ మెరుపులు, బౌలింగ్లో కుర్ర పేసర్ల ప్రదర్శన వెరసి హైదరాబాద్కు ఈ సీజన్లో అత్యంత అవసరమైన విజయాన్ని అందించాయి.
తాజావార్తలు
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..