Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియాన్స్ ఘోర పరాజయం చవిచూసింది. ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస ఓటములతో విసిగిపోయిన పాండ్యా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమపై తీవ్ర ఒత్తిడి పెంచిందని, ఇదే తమ పతనానికి కారణమని అభిప్రాయపడ్డాడు. లక్ష్య ఛేదనలో ఆరంభం బాగుంటేనే ఫలితం అనుకూలంగా వచ్చేదని, కానీ ఈ మ్యాచ్లో అది సాధ్యపడలేదని పేర్కొన్నాడు. పిచ్ గురించి వివరిస్తూ.. “పిచ్లో మార్పు వచ్చిందని నేను సాకులు చెప్పను. ముంబై బ్యాటర్లలాగే వాళ్లూ అదే ట్రాక్పై బ్యాటింగ్ చేశారు. వాళ్లు 207 పరుగులు చేశారంటే అది వారి ప్రతిభ. పిచ్ ఒకేలా ఉన్నప్పుడు మేము కూడా బాగా బ్యాటింగ్ చేయాల్సింది” అని హార్దిక్ అన్నాడు.
ఈ మ్యాచ్లో బంతి కాస్త గ్రిప్ అవుతున్న మాట వాస్తవమేనని, తమ స్పిన్నర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపాడు. అయితే సంజూ శామ్సన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ను మలుపు తిప్పిందని, ఇతర బ్యాటర్లు సైతం అతనికి సహకరించడంతో చెన్నై ఒక భారీ స్కోరును సాధించగలిగిందని కొనియాడాడు. ముందున్న మ్యాచుల కోసం జట్టులో మార్పులు ఉంటాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. “జట్టు కూర్పుపై ఖచ్చితంగా చర్చ జరుపుతాం. మళ్లీ గెలుపు బాట పట్టడానికి ఏం చేయాలో కూర్చుని ఆలోచిస్తాం. మాకు ఇంకా సమయం ఉంది, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఏం చేయగలమో దానిపై దృష్టి సారిస్తాం” అని హార్దిక్ స్పష్టం చేశాడు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
- Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న వాంఖడే స్టేడియంలో చెన్నై 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్ బరిలోకి దిగిన ముంబై పేలవ బ్యాటింగ్తో ఓటమిపాలైంది. స్పిన్నర్లు అకీల్ హొసీన్, నూర్ అహ్మద్ల ధాటికి విలవిలలాడిన ముంబై సొంతగడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక మొదట చెన్నై ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లు చేతులెత్తేసినా.. సంజు శామ్సన్ మాత్రం అద్భుతంగా రాణించాడు. రెండో శతకంతో జట్టుకు మెరుగైన స్కోరునందించాడు. దీంతో గత మ్యాచ్లో గుజరాత్ను 100 పరుగుల తేడాతో ఓడించిన ముంబై.. ఈ మ్యాచ్లో 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..