ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. ఛేదనలో లక్నో సునాయాసం విజయం సాదిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటై.. మరో దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది.ఈ మ్యాచ్లో లక్నో తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంపాక్ట్ ప్లేయర్గా హిమ్మత్ సింగ్ను పంపడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోసిన్ ఖాన్ స్థానంలో హిమ్మత్ సింగ్ను లక్నో ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంది. అయితే ఈ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. హిమ్మత్ 15 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా హిమ్మత్ ప్రభావం చూపలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మ్యాచ్యూ మలుపు తిప్పాలి. హిమ్మత్ మాత్రం ఇంపాక్ట్ చూపలేకపోయాడు. దాంతో సోషల్ మీడియాలో అభిమానులు లక్నో జట్టుపై ట్రోల్ చేస్తున్నారు. ‘కీలక సమయంలో హిమ్మత్ సింగ్ను ఎందుకు పంపారు?’, ‘జట్టుకు స్పష్టమైన ప్లాన్ లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కొంతమంది అయితే ‘లక్నో ఫ్రాంచైజ్కు ఏం చేయాలో తెలియడం లేదు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ అనే వ్యూహం మ్యాచ్ను మలుపుతిప్పేలా ఉంటుంది. కానీ సరైన ఆటగాడిని ఎంపిక చేయకపోతే.. అది రివర్స్ అవుతుంది. ఈ మ్యాచ్లో అదే జరిగిందని అభిమానులు అంటున్నారు. మొత్తానికి లక్నో తీసుకున్న ఈ నిర్ణయం జట్టుపై మరింత ఒత్తిడి పెంచింది. ముందు మ్యాచ్లలో అయినా ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో జట్టు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Can’t believe LSG sent someone like Himmat Singh as an impact player… like why🤦🏻♂️
This franchise just doesn’t look like it knows what it’s doing anymore. pic.twitter.com/sPtvSAsmE2
— Vipin Tiwari (@Vipintiwari952) April 22, 2026
