BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
- ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు
- తప్పు చేస్తే సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్
- సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI New Guidelines for Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్లు, జట్టు సిబ్బంది వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా హనీ ట్రాప్ ఘటనలు, లైంగిక ఆరోపణలు వంటి సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు చేపట్టింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఏడు పేజీల ప్రత్యేక మార్గదర్శకాలను పంపారు. ఈ లేఖలో ప్లేయర్స్, జట్టు అధికారుల భద్రత, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
ఐపీఎల్ వంటి హై ప్రొఫైల్ టోర్నీల్లో హనీ ట్రాప్ వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రతి ఫ్రాంచైజీ అప్రమత్తంగా ఉండాలని లేఖలో దేవజిత్ సైకియా ప్రాంచైజీ యాజమాన్యాలకు సూచించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్లేయర్స్ బస చేసే హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. హోటళ్లలో అనధికారికంగా ఎవరికైనా ప్రవేశం కల్పించినట్లయితే.. కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
జట్టు ప్లేయర్స్ లేదా సిబ్బంది గదుల్లోకి ఎవరైనా రావాలంటే.. ముందుగా టీమ్ మేనేజర్ అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాల్లో దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కుటుంబసభ్యులు, బంధువులు అయినా కూడా ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సభ్యులు హోటల్ వెలుపలికి వెళ్లే ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. టోర్నీ సమయంలో వ్యక్తిగత ప్రయాణాల గురించి కూడా టీమ్ మేనేజర్కు తెలియజేయాల్సి ఉంటుంది.
నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హెచ్చరించారు. షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా టోర్నీ నుంచి డిస్క్వాలిఫికేషన్ వంటి శిక్షలు విధించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు ఈ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని బీసీసీఐ లేఖలో సూచించింది. ఇక మ్యాచ్ల సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్లో ఆటగాళ్లు లేదా మేనేజర్లతో నేరుగా మాట్లాడకూడదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ ప్రతిష్టను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ చెప్పుకోచ్చింది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!