BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
- ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు
- తప్పు చేస్తే సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్
- సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI New Guidelines for Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్లు, జట్టు సిబ్బంది వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా హనీ ట్రాప్ ఘటనలు, లైంగిక ఆరోపణలు వంటి సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు చేపట్టింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఏడు పేజీల ప్రత్యేక మార్గదర్శకాలను పంపారు. ఈ లేఖలో ప్లేయర్స్, జట్టు అధికారుల భద్రత, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
ఐపీఎల్ వంటి హై ప్రొఫైల్ టోర్నీల్లో హనీ ట్రాప్ వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రతి ఫ్రాంచైజీ అప్రమత్తంగా ఉండాలని లేఖలో దేవజిత్ సైకియా ప్రాంచైజీ యాజమాన్యాలకు సూచించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్లేయర్స్ బస చేసే హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. హోటళ్లలో అనధికారికంగా ఎవరికైనా ప్రవేశం కల్పించినట్లయితే.. కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
జట్టు ప్లేయర్స్ లేదా సిబ్బంది గదుల్లోకి ఎవరైనా రావాలంటే.. ముందుగా టీమ్ మేనేజర్ అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాల్లో దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కుటుంబసభ్యులు, బంధువులు అయినా కూడా ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సభ్యులు హోటల్ వెలుపలికి వెళ్లే ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. టోర్నీ సమయంలో వ్యక్తిగత ప్రయాణాల గురించి కూడా టీమ్ మేనేజర్కు తెలియజేయాల్సి ఉంటుంది.
నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హెచ్చరించారు. షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా టోర్నీ నుంచి డిస్క్వాలిఫికేషన్ వంటి శిక్షలు విధించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు ఈ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని బీసీసీఐ లేఖలో సూచించింది. ఇక మ్యాచ్ల సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్లో ఆటగాళ్లు లేదా మేనేజర్లతో నేరుగా మాట్లాడకూడదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ ప్రతిష్టను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ చెప్పుకోచ్చింది.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!