BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
- ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు
- తప్పు చేస్తే సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్
- సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI New Guidelines for Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్లు, జట్టు సిబ్బంది వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా హనీ ట్రాప్ ఘటనలు, లైంగిక ఆరోపణలు వంటి సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు చేపట్టింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఏడు పేజీల ప్రత్యేక మార్గదర్శకాలను పంపారు. ఈ లేఖలో ప్లేయర్స్, జట్టు అధికారుల భద్రత, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
ఐపీఎల్ వంటి హై ప్రొఫైల్ టోర్నీల్లో హనీ ట్రాప్ వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రతి ఫ్రాంచైజీ అప్రమత్తంగా ఉండాలని లేఖలో దేవజిత్ సైకియా ప్రాంచైజీ యాజమాన్యాలకు సూచించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్లేయర్స్ బస చేసే హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. హోటళ్లలో అనధికారికంగా ఎవరికైనా ప్రవేశం కల్పించినట్లయితే.. కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
జట్టు ప్లేయర్స్ లేదా సిబ్బంది గదుల్లోకి ఎవరైనా రావాలంటే.. ముందుగా టీమ్ మేనేజర్ అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాల్లో దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కుటుంబసభ్యులు, బంధువులు అయినా కూడా ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సభ్యులు హోటల్ వెలుపలికి వెళ్లే ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. టోర్నీ సమయంలో వ్యక్తిగత ప్రయాణాల గురించి కూడా టీమ్ మేనేజర్కు తెలియజేయాల్సి ఉంటుంది.
నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హెచ్చరించారు. షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా టోర్నీ నుంచి డిస్క్వాలిఫికేషన్ వంటి శిక్షలు విధించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు ఈ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని బీసీసీఐ లేఖలో సూచించింది. ఇక మ్యాచ్ల సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్లో ఆటగాళ్లు లేదా మేనేజర్లతో నేరుగా మాట్లాడకూడదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ ప్రతిష్టను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ చెప్పుకోచ్చింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!