Arshdeep Singh Expensive Over: ఒకే ఓవర్లో 10 బంతులు, 24 రన్స్.. అర్ష్దీప్ సింగ్తో మాములుగా ఉండదు మరి!
- ఐపీఎల్ 2025లో ఇరగదీసిన అర్ష్దీప్ సింగ్
- ఐపీఎల్ 2026లో అర్ష్దీప్ పేలవ ప్రదర్శన
- ఒకే ఓవర్లో 10 బంతులు, 24 రన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Concedes 24 Runs in an Over: ఐపీఎల్ 2025లో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ ఇరగదీశాడు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున 21 వికెట్లు తీసి అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం తేలిపోతున్నాడు. ఒత్తిడికి లోనై అదనపు పరుగులు ఎక్కువగా ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో మొత్తం 11 బంతులు విసిరాడు. అందులో 4 వైడ్ బంతులు ఉన్నాయి. ఆ ఓవర్లో మొత్తంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా మరోసారి ఒత్తిడికి లోనై చెత్త ప్రదర్శన చేశాడు.
ముల్లాన్పుర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జరుగుతున్న మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ మరో అత్యంత ఖరీదైన ఓవర్ను నమోదు చేశాడు. ఒకే ఓవర్లో 10 బంతులు వేయగా.. ఇందులో నాలుగు వైడ్ బంతులు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగడంతో మొత్తగా 24 రన్స్ సమర్పించుకున్నాడు. అర్ష్దీప్ బౌలింగ్లో రెండు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు. దాంతో అర్ష్దీప్ బౌలింగ్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అర్ష్దీప్ ఇదేం బౌలింగ్, అర్ష్దీప్ సింగ్తో మాములుగా ఉండదు మరి, ఇలా అయితే పంజాబ్ గెలవడం కష్టమే అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
సన్రైజర్స్ హైదరాబాద్ మూడో ఓవర్లో అర్ష్దీప్ సింగ్ 24 రన్స్ ఇచ్చుకున్నాడు. మొదట షార్ట్ బాల్ను మిడ్వికెట్ వైపు ఫోర్గా మలిచిన అభిషేక్ శర్మ.. తర్వాతి బంతికి అద్భుత టైమింగ్తో మరో ఫోర్ బాదాడు. దాంతో ఒత్తిడికి లోనైన అర్ష్దీప్.. నాలుగు వైడ్లు వేశాడు. ఆపై స్లోయర్ బాల్ను ముందుగానే అంచనా వేసి లాంగ్ ఆన్ మీదుగా అభిషేక్ భారీ సిక్స్ కొట్టాడు. మరో బంతిని షార్ట్ థర్డ్మ్యాన్ మీదుగా టాప్ ఎడ్జ్తో సిక్స్గా మార్చాడు. ఈ ఓవర్లో అర్ష్దీప్ తేలిపోవడంతో పంజాబ్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు సన్రైజర్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..