క్రికెట్ అభిమానులు ఎంతాగానో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2022 సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకి కోల్కత్తా నైట్రైడర్స్తో తలపడనుంది. అయితే సీజన్ తొలి మ్యాచ్లోనే కోల్కత్తా నైట్రైడర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ని 6 వికెట్ల తేడాతో ఓడించేసిన విషయం తెలిసిందే.
అయితే బెంగళూరు మాత్రం తన ఫస్ట్ మ్యాచ్లోనే 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు జరుగనున్న మ్యాచ్లో ఆర్సీబీని విజయం వరిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఐపీల్ ప్రారంభం నుంచి కోల్కత్తా, బెంగళూరు జట్ల నడుమ 30 మ్యాచ్లు జరుగగా.. అందులో 17 మ్యాచ్లు కోల్కత్తా విజయం సాధించింది. మిగితా 13 మ్యాచ్ల్లో ఆర్సీబీ జట్టు గెలుపొందింది.
