Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే ఐర్లాండ్లో భారీ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు వైభవ్ పేరు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అతడిని భారత జెర్సీలో చూడాలనే ఆసక్తితో యూరప్ నలుమూలల నుంచి అభిమానులు బెల్ఫాస్ట్కు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారత, ఐర్లాండ్ మాజీ క్రికెటర్ ఎం.వి. నరసింహారావు ప్రకారం, వైభవ్ సూర్యవంశీపై నెలకొన్న ఆసక్తి కారణంగా స్టోర్మాంట్ క్రికెట్ గ్రౌండ్ మ్యాచ్ల టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సుమారు 7,000 మంది ప్రేక్షకులు మాత్రమే కూర్చోగల ఈ మైదానంలో సీట్ల కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్ అభిమానులతో పాటు ఫ్రాన్స్ రాజధాని పారిస్ సహా యూరప్లోని పలు నగరాల నుంచి కూడా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారని నరసింహారావు తెలిపారు. దీంతో ప్రేక్షకుల కోసం సరిపడా ఏర్పాట్లు చేయడం నిర్వాహకులకు సవాలుగా మారే అవకాశం ఉంది. “బేబీ బాస్”గా గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే భారత క్రికెట్లో వర్ధమాన తారగా నిలిచాడు. చిన్న వయస్సులోనే తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన అతడు, ఇప్పుడు భారత జట్టులో అరంగేట్రం చేసే అవకాశంతో మరింత వార్తల్లో నిలిచాడు. తుది జట్టులో చోటు దక్కితే, ఐర్లాండ్తో జరిగే మ్యాచ్ అతని తొలి అంతర్జాతీయ మ్యాచ్గా నిలవనుంది.
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
వైభవ్ అరంగేట్రంపై కేవలం భారతదేశంలోనే కాదు, యూరప్ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొనడం విశేషం. అతడిని మైదానంలో చూడాలనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తుండటంతో ఈ సిరీస్కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న బెల్ఫాస్ట్లో జరగనుంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఈ సిరీస్లో మంచి ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్తో చిరంజీవి, రామ్ చరణ్కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!