Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే ఐర్లాండ్లో భారీ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు వైభవ్ పేరు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అతడిని భారత జెర్సీలో చూడాలనే ఆసక్తితో యూరప్ నలుమూలల నుంచి అభిమానులు బెల్ఫాస్ట్కు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారత, ఐర్లాండ్ మాజీ క్రికెటర్ ఎం.వి. నరసింహారావు ప్రకారం, వైభవ్ సూర్యవంశీపై నెలకొన్న ఆసక్తి కారణంగా స్టోర్మాంట్ క్రికెట్ గ్రౌండ్ మ్యాచ్ల టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సుమారు 7,000 మంది ప్రేక్షకులు మాత్రమే కూర్చోగల ఈ మైదానంలో సీట్ల కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్ అభిమానులతో పాటు ఫ్రాన్స్ రాజధాని పారిస్ సహా యూరప్లోని పలు నగరాల నుంచి కూడా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారని నరసింహారావు తెలిపారు. దీంతో ప్రేక్షకుల కోసం సరిపడా ఏర్పాట్లు చేయడం నిర్వాహకులకు సవాలుగా మారే అవకాశం ఉంది. “బేబీ బాస్”గా గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే భారత క్రికెట్లో వర్ధమాన తారగా నిలిచాడు. చిన్న వయస్సులోనే తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన అతడు, ఇప్పుడు భారత జట్టులో అరంగేట్రం చేసే అవకాశంతో మరింత వార్తల్లో నిలిచాడు. తుది జట్టులో చోటు దక్కితే, ఐర్లాండ్తో జరిగే మ్యాచ్ అతని తొలి అంతర్జాతీయ మ్యాచ్గా నిలవనుంది.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
- Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
వైభవ్ అరంగేట్రంపై కేవలం భారతదేశంలోనే కాదు, యూరప్ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొనడం విశేషం. అతడిని మైదానంలో చూడాలనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తుండటంతో ఈ సిరీస్కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న బెల్ఫాస్ట్లో జరగనుంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఈ సిరీస్లో మంచి ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!