భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు

టోక్యో పారాలింపిక్స్‌ లో భారత్‌ తన జోరును కొనసాగుస్తూనే ఉంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్‌… తాజాగా మరో రెండు పతకాలను దక్కించుకుంది. బ్యాడ్మింటన్‌ పురుషుల ఎస్‌ఎల్‌-3 విభాగంలో ప్రమోద్‌ భగత్‌ కు బంగారు పతకం సాధించాడు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3 విభాగంలో ఫైనల్‌ కు చేరిన ప్రమోద్‌ భగత్‌ బంగారు పతకం సాధించాడు. అలాగే… భారత అథ్లెట్‌ మనోజ్ సర్కార్ కూడా ఇవాళ కాంస్య పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 లో కాంస్య పతకం సాధించాడు మనోజ్ సర్కార్. దీంతో భారత్‌ పతకాల సంఖ్య 17 కు చేరుకుంది.