ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ సాధించేలా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్…అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ…పరుగులు చేశారు. ఇద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే… 126 పరుగుల వద్ద రోహిత్ ఔటయ్యాడు. 145 బంతులాడిన రోహిత్…11 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 83 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ పెవిలియన్ చేరిన తర్వాత…క్రీజులోకి వచ్చిన నయా వాల్ చతేశ్వర్ పూజారా 9 పరుగులకే వెనుదిరిగాడు.
Read: ఆగస్టు 13, శుక్రవారం దినఫలాలు
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ కోహ్లీ…కేఎల్ రాహుల్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదే క్రమంలో ప్రతిష్టాత్మకంగా లార్డ్స్ మైదానంలో రాహుల్…సెంచరీ పూర్తి చేశారు. ఈ మైదానంలో సెంచరీ చేసిన టీమిండియా మూడో ఓపెనర్ కేఎల్ రాహుల్. వినో మన్కడ్, రవిశాస్త్రి తర్వాత లార్డ్స్లో సెంచరీ చేసిన మూడో ఓపెనర్గా రాహుల్ ప్రత్యేకత చాటుకున్నాడు. జట్టు స్కోరు 267 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అర్ధశతకానికి చేరువైన విరాట్…రాబిన్సన్ బౌలింగ్లో స్లిప్లో జోరూట్ చేతికి చిక్కాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి భారత్…276 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 127 పరుగులు, అజింక్య రహానే ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.