INDvsNZ T20: ఒక్క సిక్స్ కొట్టలే..ఇదేం మ్యాచ్రా బాబు
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 టెస్టు మ్యాచ్ను తలపించింది. పేరుకు టీ20 అయినా ఆ మెరుపులు ఎక్కడా కనిపించలేదు. ఆదివారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియం ఈ మ్యాచ్కు వేదికైంది. ఈ మ్యాచ్లో కివీస్ 20 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపు దక్కించుకుంది. కివీస్ తక్కువ లక్ష్యాన్నే నిర్దేశించినా మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. కాగా ఈ మ్యాచ్లో ఐదు రికార్డులు కూడా బద్దలయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కివీస్, ఇండియా రెండో టీ20కి ముందు లక్నోలో ఐదు T20Iలు జరిగాయి. అన్ని మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం అందుకుంది. అయితే ఆదివారం తొలిసారి లక్నోలో ఛేజింగ్ చేసిన భారత జట్టు గెలుపు సొంతం చేసుకుంది. లక్నోలో లక్ష్యాన్ని అందుకున్న మొదటి టీమ్గా నిలిచింది. కానీ భారత్ ఛేజింగ్ అంత సులువుగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
Also Read
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
- Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
Toyota: ప్రపంచంలో ఈ సంస్థ కార్లదే హవా..వరుసగా మూడో ఏడాది నెంబర్వన్
అలాగే 2007లో ఇండియాపై న్యూజిలాండ్ తన మొదటి T20 మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ప్రతి టీ20లో కనీసం 100 పరుగులు చేసింది. కానీ లక్నోలో జరిగిన మ్యాచ్లో 100కు ఒక్క పరుగు దూరంలో కివీస్ ఆగిపోయింది. 20 ఓవర్లలో 99/8కి పరిమితం అయింది.
ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 19 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్లో అతని స్ట్రైక్ రేట్ కేవలం 59.37 మాత్రమే. ఒక ఇన్నింగ్స్లో కనీసం 30 బంతులు ఆడి తక్కువ స్ట్రైక్రేట్ నమోదు చేసిన భారత ఓపెనర్గా కిషన్ చెత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు గతేడాది ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై 83.33 స్ట్రైక్ రేట్తో 42 బంతుల్లో 35 పరుగులు చేశాడు. లక్నోలో కిషన్ తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.
ఆదివారం జరిగిన రెండో టీ20లో ఒక్క ప్లేయర్ కూడా సిక్స్ బాదలేకపోయారు. భారీ హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్ కూడా బాల్ను బౌండరీ దాటించలేకపోయారు. ఈ మ్యాచ్లో మొత్తం 239 బాల్స్ చేశారు. మొదటి ఇన్నింగ్స్లో 120, రెండో ఇన్నింగ్స్లో 119 బాల్స్ వేశారు. కానీ ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. దీంతో ఎక్కువ బాల్స్ ఆడి సిక్స్ నమోదు కాని మ్యాచ్గా రికార్డు సొంతం చేసుకుంది. ఈ రికార్డు ఇంతకుముందు 2021లో మీర్పూర్లో జరిగిన బంగ్లా, కివీస్ మ్యాచ్ పేరిట ఉంది. ఈ మ్యాచ్లో 239 బంతులు ఆడినా ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు.
Abdul Razzaq: ఆ పాక్ బౌలర్ ముందు బుమ్రా పనికిరాడు: పాక్ మాజీ ప్లేయర్
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!