INDvsNZ T20: రెండో టీ20 పిచ్ క్యూరేటర్పై వేటు..టీమ్ అడిగితేనే అలా చేశాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 టెస్టు మ్యాచ్ను తలపించింది. బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చారు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయారు. ఫోర్లు కూడా అంతంతమాత్రమే. దీంతో మ్యాచ్ అనంతరం పిచ్పై చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి పిచ్లు తయారు చేయడమేంటని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు కివీస్ జట్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే లక్నో ఏకనా స్టేడియం పిచ్ క్యూరేటర్పై వేటు వేసినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. క్యూరేటర్పై అయితే వేటు వేశారు కానీ.. ఈ విషయంలో అసలు నిందించాల్సింది మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ను అని తాజాగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది.
U19 World Cup: సచిన్ చేతుల మీదుగా అండర్-19 విమెన్స్ టీమ్కు సత్కారం
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
నిజానికి ఈ మ్యాచ్ కోసం క్యూరేటర్ నల్ల మట్టితో చేసిన రెండు పిచ్లను రూపొందించాడట. అయితే మ్యాచ్కు మూడు రోజుల ముందు టీమిండియా మేనేజ్మెంట్ సూచన మేరకు ఎర్ర మట్టి పిచ్ తయారు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో పిచ్ సరిగా కుదరలేదని సమాచారం. దీంతో టీ20 మ్యాచ్కు అసలు పనికి రాని పిచ్ తయారైంది. ఈ పిచ్ పూర్తిగా స్పిన్కు అనుకూలించింది. మ్యాచ్లో మొత్తం 39.5 ఓవర్లు పడగా.. అందులో 30 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. మొత్తంగా కేవలం 200 రన్స్ మాత్రమే వచ్చాయి. అసలు ఈ పిచ్ టీ20లకు పనికి రాదని మ్యాచ్ తర్వాత పాండ్యా స్పష్టం చేశాడు.
Anam Ramnarayana Reddy; 15 నెలల్లో ఏం మార్పులు వస్తాయో చూడాలి
దీంతో ఇప్పటి వరకూ ఉన్న క్యూరేటర్ను తీసేసి గ్వాలియర్కు చెందిన సంజీవ్ అగర్వాల్ను నియమించారు. మార్చి నుంచి ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ఆ సమయానికి లక్నో పిచ్ను మెరుగ్గా చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ను 1-1తో సమం చేసిన టీమిండియా నిర్ణయాత్మక మూడో టీ20ని బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్ లో ఆడనుంది.
తాజావార్తలు
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
-
Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
-
Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!