Hyderabad Gymkhana: టికెట్ల కోసం పోటెత్తిన జనం.. భారీ క్యూ లైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Crowd Gathers At Hyderabad Gymkhana For Ind vs Aus Match Tickets: సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే! మూడేళ్ల విరామం తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్కి అతిథ్యం ఇవ్వనుండడంతో, టికెట్ల కోసం జనాలు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం గురువారం చేపట్టనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించడంతో.. సికింద్రాబాద్లోని జిమ్ఖానా మైదానానికి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయని హెచ్సీఏ పేర్కొనడంతో.. రాత్రి నుంచే జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

Also Read
- Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
- James Hopes: "గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం".. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
- Kumar Sangakkara: "వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను".. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
ఇదిలావుండగా.. తొలుత ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకంపై విషయంపై గందరగోళ వాతావరణం నెలకొంది. మొదట పేటీఎం వేదికగా టికెట్లు అమ్మినట్టు హెచ్సీఏ పేర్కొంది. అయితే.. ఆన్లైన్లో టికెట్లు బుక్ అవ్వడం లేదంటూ చాలామంది ఫిర్యాదు చేశారు. క్రీడాభిమానుల తమ ఆందోళన వ్యక్తం చేశారు. 39 వేల టికెట్లు ఏమయ్యాయంటూ బుధవారం అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే జిమ్ఖానా మైదానంలో టికెట్ల అమ్మకం అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో.. ఉదయం 7 గంటలకే వేలాది సంఖ్యలో జనాలు చేరుకున్నారు. అయితే.. గేట్లు మూసి ఉండటం, అధికారులెవరూ లేకపోవడంతో ఫ్యాన్స్ గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. కొందరు మైదానంలోకి దూసుకెళ్లి.. ‘హెచ్సీఏ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు తీశారు. అప్పుడు హెచ్సీఏ అధికారులు దిగి రావడం, గురువారం టికెట్లు అమ్ముతామని హామీ ఇవ్వడంతో అభిమానులు శాంతించారు.

ఇలా టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనడంతో.. తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. టీ20 మ్యాచ్ టికెట్లపై అవకతవకలపై విచారణ జరుపుతామని, బ్లాక్లో టికెట్లు అమ్మినట్టు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ టికెట్ల వ్యవహారంపై క్రీడా, పోలీస్ శాఖలు నిఘా ఉంటాయని.. హెచ్సీఏ కేవలం పది మంది అనుభవించడం కోసం కాదని.. ఉప్పల్ స్టేడియంకు ప్రభుత్వం 23 ఎకరాలు విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర పరువు తీసేలా వ్యవహరించొద్దని అన్నారు.
తాజావార్తలు
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..