Hyderabad Gymkhana: టికెట్ల కోసం పోటెత్తిన జనం.. భారీ క్యూ లైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Crowd Gathers At Hyderabad Gymkhana For Ind vs Aus Match Tickets: సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే! మూడేళ్ల విరామం తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్కి అతిథ్యం ఇవ్వనుండడంతో, టికెట్ల కోసం జనాలు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం గురువారం చేపట్టనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించడంతో.. సికింద్రాబాద్లోని జిమ్ఖానా మైదానానికి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయని హెచ్సీఏ పేర్కొనడంతో.. రాత్రి నుంచే జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

Also Read
- INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
- Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
- Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
- Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
ఇదిలావుండగా.. తొలుత ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకంపై విషయంపై గందరగోళ వాతావరణం నెలకొంది. మొదట పేటీఎం వేదికగా టికెట్లు అమ్మినట్టు హెచ్సీఏ పేర్కొంది. అయితే.. ఆన్లైన్లో టికెట్లు బుక్ అవ్వడం లేదంటూ చాలామంది ఫిర్యాదు చేశారు. క్రీడాభిమానుల తమ ఆందోళన వ్యక్తం చేశారు. 39 వేల టికెట్లు ఏమయ్యాయంటూ బుధవారం అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే జిమ్ఖానా మైదానంలో టికెట్ల అమ్మకం అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో.. ఉదయం 7 గంటలకే వేలాది సంఖ్యలో జనాలు చేరుకున్నారు. అయితే.. గేట్లు మూసి ఉండటం, అధికారులెవరూ లేకపోవడంతో ఫ్యాన్స్ గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. కొందరు మైదానంలోకి దూసుకెళ్లి.. ‘హెచ్సీఏ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు తీశారు. అప్పుడు హెచ్సీఏ అధికారులు దిగి రావడం, గురువారం టికెట్లు అమ్ముతామని హామీ ఇవ్వడంతో అభిమానులు శాంతించారు.

ఇలా టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనడంతో.. తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. టీ20 మ్యాచ్ టికెట్లపై అవకతవకలపై విచారణ జరుపుతామని, బ్లాక్లో టికెట్లు అమ్మినట్టు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ టికెట్ల వ్యవహారంపై క్రీడా, పోలీస్ శాఖలు నిఘా ఉంటాయని.. హెచ్సీఏ కేవలం పది మంది అనుభవించడం కోసం కాదని.. ఉప్పల్ స్టేడియంకు ప్రభుత్వం 23 ఎకరాలు విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర పరువు తీసేలా వ్యవహరించొద్దని అన్నారు.
తాజావార్తలు
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!