కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడా? హర్ష గోయెంక ట్వీట్పై నెటిజన్ల కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్ష గోయెంక.. సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి పరిచయం అక్కర్లేని పేరు. తనదైన ఫన్నీ, వెటకార ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. కాగా మరోసారి గోయెంక చేసిన ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. అంతేకాదు ఆ ట్వీట్ నెటిజన్లను తికమకలోనూ పడేసింది. ఈసారి ఆయన చేసిన ట్వీట్ ఎవరి గురించో కాదు టీమిండియాలో డబుల్ సెంచరీ వీరులకు సంబంధించింది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే తర్వాత స్కోర్ బోర్డును చూపిస్తూ గోయెంక ఈ ట్వీట్ చేశాడు.
Also Read
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకురండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్పై భారీ జరిమానా, నిషేధం..
విషయం ఏంటంటే.. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట కివీస్ను 108 రన్స్కే ఆలౌట్ చేసిన రోహిత్సేన అనంతరం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యా్న్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ (51), గిల్ (40 నాటౌట్), కోహ్లీ (11), ఇషాన్ కిషన్ (8 నాటౌట్)కు మాత్రమే బ్యాటింగ్ అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన స్కోర్ బోర్డును ట్వీట్ చేసిన హర్ష.. “మీరు గమనించారా.. ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు వచ్చిన వారంతా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన వారే” అంటూ పోస్ట్ చేశాడు. దీనిని గమనించిన నెటిజన్లు రోహిత్, గిల్, ఇషాన్ సరే కానీ కోహ్లీ ఎప్పుడు డబుల్ సెంచరీ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్వీట్ చేసేముందు ఓసారి నిజాలు తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. అయితే వారి కామెంట్లకు రిప్లేగా హర్ష.. “కోహ్లీ సియెట్ బ్యాట్ యూజ్ చేయలేదు. అందుకే డబుల్ సెంచరీ చేయలేదు” అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు నిజమే కదా అంటూ హర్ష సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.
IAS Officer Case Update: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి.. డిప్యూటీ తహశీల్దార్ పై వేటు
మ్యాచ్ విషయానికి వస్తే రెండో వన్డేలో కివీస్ను చిత్తుచేసింది టీమిండియా. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ను 34.3 ఓవర్లలో 108 రన్స్కే కట్టడి చేసింది. షమీ 3, పాండ్యా 2, సుందర్ 2 వికెట్లతో సత్తాచాటగా. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్తో రాణించారు. ఇక టార్గెట్ ఛేజింగ్లో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ (51), గిల్ (40 నాటౌట్) శుభారంభాన్నిచ్చారు. హిట్మ్యాన్ తనదైన శైలిలో రెచ్చిపోగా గిల్ అతడికి సపోర్ట్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ చేశాక రోహిత్ ఔట్ కాగా కోహ్లీ (11) నిరాశ పర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8 నాటౌట్) గిల్తో కలిసి మ్యాచ్ ముగించేశాడు. దీంతో సిరీస్ 2-0 తేడాతో టీమిండియా వశమైంది. చివరిదైన నామమాత్రపు మూడో వన్డే మంగళవారం ఇండోర్లో జరగనుంది.
తాజావార్తలు
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!